ఎయిర్‌ ఇండియా 'సూపర్‌ సేవర్‌' పథకం

- June 28, 2016 , by Maagulf
ఎయిర్‌ ఇండియా 'సూపర్‌ సేవర్‌' పథకం

రాజ్‌ధానీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మాత్రమే వర్తింపు ఎయిర్‌ ఇండియా 'సూపర్‌ సేవర్‌' పథకం  రైల్వే టికెట్‌ ఖరారుకాని ప్రయాణికులకు శుభవార్త. రాజ్‌ధానీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఏసీ మొదటి తరగతి టికెట్‌ ఖరారుకాని ప్రయాణికులు.. ఇకపై ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణించవచ్చు. ఈ మేరకు కొంత కాలపరిమితి వరకు ప్రత్యేక పథకాన్ని విమానయాన సంస్థ ప్రారంభించనుంది. నిరీక్షణ జాబితా(వెయిటింగ్‌ లిస్టు)లో ఉన్న ప్రయాణికులు విమానం ప్రారంభానికి నాలుగు గంటలముందు టికెట్‌ తీసుకోవచ్చని ఎయిర్‌ ఇండియా ఓ ప్రకటనలో మంగళవారం తెలిపింది. 'సూపర్‌ సేవర్‌' అనే ఈ పథకాన్ని జూన్‌ 26 నుంచి సెప్టెంబరు 30 వరకు అమలు చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 రాజ్‌ధానీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో రోజూ 20 వేల మంది ప్రయాణిస్తున్నారు. ముంబయి, చెన్నై, కోల్‌కతా, గువాహాటి రాజ్‌ధానీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మొదటి తరగతి ఏసీ టికెట్‌ ధర వరుసగా రూ.4755, 6335, 4815, 5990 వసూలు చేస్తున్నారు. 'సీట్ల కొరత కారణంగా చాలామందికి టికెట్లు ఖరారు కావడం లేదు. ఈ లోటును ఎయిర్‌ ఇండియా భర్తీ చేస్తుంది' అని విమానయాన సంస్థ స్పష్టం చేసింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే రాజ్‌ధానీ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే ముందే గమ్యాన్ని చేరుకోగలరని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com