ఎయిర్ ఇండియా 'సూపర్ సేవర్' పథకం
- June 28, 2016
రాజ్ధానీ ఎక్స్ప్రెస్ రైళ్లకు మాత్రమే వర్తింపు ఎయిర్ ఇండియా 'సూపర్ సేవర్' పథకం రైల్వే టికెట్ ఖరారుకాని ప్రయాణికులకు శుభవార్త. రాజ్ధానీ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ మొదటి తరగతి టికెట్ ఖరారుకాని ప్రయాణికులు.. ఇకపై ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించవచ్చు. ఈ మేరకు కొంత కాలపరిమితి వరకు ప్రత్యేక పథకాన్ని విమానయాన సంస్థ ప్రారంభించనుంది. నిరీక్షణ జాబితా(వెయిటింగ్ లిస్టు)లో ఉన్న ప్రయాణికులు విమానం ప్రారంభానికి నాలుగు గంటలముందు టికెట్ తీసుకోవచ్చని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో మంగళవారం తెలిపింది. 'సూపర్ సేవర్' అనే ఈ పథకాన్ని జూన్ 26 నుంచి సెప్టెంబరు 30 వరకు అమలు చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 రాజ్ధానీ ఎక్స్ప్రెస్ రైళ్లలో రోజూ 20 వేల మంది ప్రయాణిస్తున్నారు. ముంబయి, చెన్నై, కోల్కతా, గువాహాటి రాజ్ధానీ ఎక్స్ప్రెస్ రైళ్లలో మొదటి తరగతి ఏసీ టికెట్ ధర వరుసగా రూ.4755, 6335, 4815, 5990 వసూలు చేస్తున్నారు. 'సీట్ల కొరత కారణంగా చాలామందికి టికెట్లు ఖరారు కావడం లేదు. ఈ లోటును ఎయిర్ ఇండియా భర్తీ చేస్తుంది' అని విమానయాన సంస్థ స్పష్టం చేసింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే రాజ్ధానీ ఎక్స్ప్రెస్తో పోలిస్తే ముందే గమ్యాన్ని చేరుకోగలరని తెలిపింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









