ఎయిర్ ఇండియా 'సూపర్ సేవర్' పథకం
- June 28, 2016
రాజ్ధానీ ఎక్స్ప్రెస్ రైళ్లకు మాత్రమే వర్తింపు ఎయిర్ ఇండియా 'సూపర్ సేవర్' పథకం రైల్వే టికెట్ ఖరారుకాని ప్రయాణికులకు శుభవార్త. రాజ్ధానీ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ మొదటి తరగతి టికెట్ ఖరారుకాని ప్రయాణికులు.. ఇకపై ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించవచ్చు. ఈ మేరకు కొంత కాలపరిమితి వరకు ప్రత్యేక పథకాన్ని విమానయాన సంస్థ ప్రారంభించనుంది. నిరీక్షణ జాబితా(వెయిటింగ్ లిస్టు)లో ఉన్న ప్రయాణికులు విమానం ప్రారంభానికి నాలుగు గంటలముందు టికెట్ తీసుకోవచ్చని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో మంగళవారం తెలిపింది. 'సూపర్ సేవర్' అనే ఈ పథకాన్ని జూన్ 26 నుంచి సెప్టెంబరు 30 వరకు అమలు చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 రాజ్ధానీ ఎక్స్ప్రెస్ రైళ్లలో రోజూ 20 వేల మంది ప్రయాణిస్తున్నారు. ముంబయి, చెన్నై, కోల్కతా, గువాహాటి రాజ్ధానీ ఎక్స్ప్రెస్ రైళ్లలో మొదటి తరగతి ఏసీ టికెట్ ధర వరుసగా రూ.4755, 6335, 4815, 5990 వసూలు చేస్తున్నారు. 'సీట్ల కొరత కారణంగా చాలామందికి టికెట్లు ఖరారు కావడం లేదు. ఈ లోటును ఎయిర్ ఇండియా భర్తీ చేస్తుంది' అని విమానయాన సంస్థ స్పష్టం చేసింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే రాజ్ధానీ ఎక్స్ప్రెస్తో పోలిస్తే ముందే గమ్యాన్ని చేరుకోగలరని తెలిపింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







