9,710 మంది ఖైదీలు పెరిగారు : డీజీ సౌమ్యమిశ్రా
- January 08, 2025
హైదరాబాద్: గతంతో పోల్చితే ఈ ఏడాదిలో 9710 మంది ఖైదీలు ఎక్కువగా జైల్లో ఉన్నారని డీజీ సౌమ్యమిశ్రా తెలిపారు. జైళ్ల శాఖ వార్షిక నివేదకను ఆమె విడుదల చేశారు. గత ఏడాదిలో 31,428 మంది ఖైదీలు జైల్లో ఉండగా..ఈ సారి 41,138 మంది ఉన్నారని చెప్పారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంతో పోల్చిస్తే వివిధ కేసుల్లో శిక్ష అనుభవించే వారి సంఖ్య సైతం పెరిగిందన్నారు. ఇందులో ఫోక్సో యాక్టు కింద నమోదైన కేసుల్లో 3655 మంది పురుషులు, 94 మంది మహిళలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ఎన్టీపీఎస్ యాక్ట్ కింద గతంలో 147 మంది మహిళలు శిక్ష అనుభవిస్తే.. ఈ సారి 312 మందిపై కేసు నమోదైందన్నారు. కోర్టు విచార ణలో 30,153 కేసులు ఉండగా.. 483 మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదల చేసిన్నట్లుగా పేర్కొ న్నారు. జైళ్లలో సీసీటీవీ, బాడీ వెర్ కెమెరాలు కోర్టు తేదీ వివరాలను అందరికి తెలిసేలా పెట్టామన్నా రు. ఈ ములఖత్వారా ఖైదీల కుటుంబ సభ్యుల తో వీడియో కాలామాట్లాడే అవకాశం కల్పించిన్న ట్లుగా చెప్పారు. 2650 మంది ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, ఇందులో 12,650 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామన్నారు. ఈ ఏడాదిలో 303 మందికి పేరోల్ ఇచ్చామన్నారు.
తాజా వార్తలు
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు







