రియాద్ విమానాశ్రయంలో టెర్మినల్ 1 ప్రారంభం..!!
- January 10, 2025
రియాద్: రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ టెర్మినల్ నంబర్ 1 దశలవారీ ఆపరేషన్ను రవాణా లాజిస్టిక్స్ మంత్రి, జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఇంజనీర్ సలేహ్ అల్-జాసర్ ప్రారంభించారు. టెర్మినల్ 1లోని సౌకర్యాలను, కొత్త విస్తరణ, మౌలిక సదుపాయాల పనులను మంత్రి అల్-జాసర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రయాణ టెర్మినల్ కార్యకలాపాలను దశలవారీగా ప్రారంభించడం కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్స్ 1, 2 విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులో భాగమని అన్నారు. సంవత్సరానికి 3 మిలియన్ల ప్రయాణీకుల నుండి 7 మిలియన్ల ప్రయాణీకులకు సామర్థ్యాన్ని పెంచడానికి దోహదపడుతుందన్నారు. కింగ్ సల్మాన్ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం క్రౌన్ ప్రిన్స్ మాస్టర్ ప్లాన్ను ప్రారంభించడం రాజ్యంలో విమానయాన రంగానికి ఒక ప్రధాన అభివృద్ధి మార్పును కలిగి ఉందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







