జనవరి 12న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు: ఆర్టీఏ
- January 10, 2025
యూఏఈ: జనవరి 12న ఉదయం 8:00 గంటలకు బదులుగా దుబాయ్ మెట్రో ఉదయం 5:00 గంటలకే కార్యకలాపాలు ప్రారంభిస్తుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఆ రోజు జరగనున్న దుబాయ్ మారథాన్ ను పురస్కరించుకొని మెట్రో సమయాలను పొడిగిస్తున్నట్టు తెలిపింది. అత్యంత ప్రజాదరణ పొందిన మారథాన్ 24వ ఎడిషన్లో 42 కి.మీ. ఛాలెంజ్ కోసం వేలాది మంది తరలిరానున్నారు. ఇది దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మరథాన్ ప్రారంభం, ముగింపు మదీనాత్ జుమైరా ఎదురుగా ఉన్న ఉమ్ సుకీమ్ రోడ్డులో ఉంటుంది. మూడు వేర్వేరు రేసులు 4 కి.మీ. ఫన్ రన్, 10 కి.మీ. పరుగు మరియు 42 కి.మీ. మారథాన్ నిర్వహిస్తున్నారు. 2013లో ప్రస్తుతం 34 ఏళ్ల ఇథియోపియన్, దుబాయ్ మారథాన్ను గెలుచుకున్నప్పుడు 2:04:45 వ్యక్తిగత బెస్ట్ను నమోదు చేశాడు. దుబాయ్ మారథాన్ అనేది 1998 నుండి ఎమిరేట్లో నిర్వహించబడుతున్న వార్షిక రోడ్ ఆధారిత మారథాన్ గా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









