చైనా మాంజా విక్రయించినా..వినియోగించినా చట్టపరమైన చర్యలు: సీపీ సుధీర్ బాబు
- January 13, 2025
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా నిషేధించిన చైనా మాంజాలు విక్రయించినా వినియోగించినా వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాచకొండ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.రాచకొండ పరిధిలో (మహేశ్వరం, ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్లలో) ఇప్పటివరకు 36 కేసులు నమోదు చేయడం జరిగింది.
ఇప్పటి వరకు 56 వేల మీటర్ల మాంజా సీజ్ చేయడం జరిగింది నైలాల్, నింథటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలు మనుషులతో పాటు ఎగిరే పక్షులకు ప్రమాదకరం కావడంతో పాటు పర్యావరణానికి విపత్తుగా మారుతొంది. అలాగే కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకొవడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజలు సైతం చైనా మాంజా వినియోగం పట్ల దూరంగా వుంటూ ఎవరికీ హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలని, అలాగే ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా డయల్ 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!









