చైనా మాంజా విక్రయించినా..వినియోగించినా చట్టపరమైన చర్యలు: సీపీ సుధీర్ బాబు
- January 13, 2025
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా నిషేధించిన చైనా మాంజాలు విక్రయించినా వినియోగించినా వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాచకొండ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.రాచకొండ పరిధిలో (మహేశ్వరం, ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్లలో) ఇప్పటివరకు 36 కేసులు నమోదు చేయడం జరిగింది.
ఇప్పటి వరకు 56 వేల మీటర్ల మాంజా సీజ్ చేయడం జరిగింది నైలాల్, నింథటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలు మనుషులతో పాటు ఎగిరే పక్షులకు ప్రమాదకరం కావడంతో పాటు పర్యావరణానికి విపత్తుగా మారుతొంది. అలాగే కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకొవడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజలు సైతం చైనా మాంజా వినియోగం పట్ల దూరంగా వుంటూ ఎవరికీ హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలని, అలాగే ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా డయల్ 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!









