చైనా మాంజా విక్రయించినా..వినియోగించినా చట్టపరమైన చర్యలు: సీపీ సుధీర్ బాబు
- January 13, 2025
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా నిషేధించిన చైనా మాంజాలు విక్రయించినా వినియోగించినా వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాచకొండ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.రాచకొండ పరిధిలో (మహేశ్వరం, ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్లలో) ఇప్పటివరకు 36 కేసులు నమోదు చేయడం జరిగింది.
ఇప్పటి వరకు 56 వేల మీటర్ల మాంజా సీజ్ చేయడం జరిగింది నైలాల్, నింథటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలు మనుషులతో పాటు ఎగిరే పక్షులకు ప్రమాదకరం కావడంతో పాటు పర్యావరణానికి విపత్తుగా మారుతొంది. అలాగే కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకొవడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజలు సైతం చైనా మాంజా వినియోగం పట్ల దూరంగా వుంటూ ఎవరికీ హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలని, అలాగే ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా డయల్ 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







