గ్రామసభల సమావేశాలను పరిశీలించిన సీపీ సుధీర్ బాబు
- January 21, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మళ్లీ మొదలుపెట్టిన ప్రజా పాలన దరఖాస్తులలో భాగంగా నేటి నుండి గ్రామ సభలు ప్రారంభం అయ్యాయి.రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల జాబితాలో పేరు లేని లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తోంది.ఈ సభలలోనే నాలుగు పథకాలకు సంబంధించి లబ్ది దారుల ఎంపిక, కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరగనుంది.ఈ సందర్భంగా మహేశ్వరం జోన్ పరిధిలోని రావిరాల, జల్పల్లి లేమూరు గ్రామసభల సమావేశాలను రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.గ్రామ సభలలో పాల్గొనే ప్రజలకు,దరఖాస్తులు పెట్టుకునే లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా కమిషనర్ తో పాటు డిసిపి సునీత రెడ్డి మరియు ఇతర అధికారులు ఉన్నారు .
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







