గ్రామసభల సమావేశాలను పరిశీలించిన సీపీ సుధీర్ బాబు
- January 21, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మళ్లీ మొదలుపెట్టిన ప్రజా పాలన దరఖాస్తులలో భాగంగా నేటి నుండి గ్రామ సభలు ప్రారంభం అయ్యాయి.రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల జాబితాలో పేరు లేని లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తోంది.ఈ సభలలోనే నాలుగు పథకాలకు సంబంధించి లబ్ది దారుల ఎంపిక, కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరగనుంది.ఈ సందర్భంగా మహేశ్వరం జోన్ పరిధిలోని రావిరాల, జల్పల్లి లేమూరు గ్రామసభల సమావేశాలను రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.గ్రామ సభలలో పాల్గొనే ప్రజలకు,దరఖాస్తులు పెట్టుకునే లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా కమిషనర్ తో పాటు డిసిపి సునీత రెడ్డి మరియు ఇతర అధికారులు ఉన్నారు .
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









