తెలంగాణ గవర్నర్ ప్రతిభా అవార్డులు 2024 ప్రకటించిన రాజ్ భవన్..
- January 21, 2025
హైదరాబాద్: వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు అందించే గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ గవర్నర్ కార్యాలయం తాజాగా ప్రకటించింది. ఈ అవార్డులకు మొత్తం 8 మంది ఎంపికైనట్లు వెల్లడించింది. ఈ మేరకు జాబితాను వెల్లడించింది. కాగా వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం యేటా ప్రదానం చేస్తుంది. జనవరి 26న గణతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు. మొత్తం నాలుగు రంగాలకు చెందిన వారికి ఈ పురస్కారాలు అందించనున్నట్లు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు.
పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను అందిస్తారు. గత ఐదేళ్లుగా ఉత్తమసేవలు అందిస్తున్న వారికి గవర్నర్ ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసినట్లు రాష్ట్ర గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. సంస్థలు, వ్యక్తులకు వేర్వేరు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రధానం చేస్తారని అన్నారు. ఈ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు, జ్ఞాపిక ఇస్తారు.
అవార్డుకు ఎంపికైన వ్యక్తులు, సంస్థలు ఇవే
దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలింపిక్ విజేత జీవాంజి దీప్తి, ప్రొఫెసర్ ఎం పాండురంగారావు – పిబి కృష్ణభారతికి సంయుక్తంగా అవార్డు ప్రధానం చేస్తారు. ఇక సంస్థల విషయానికొస్తే.. ధ్రువాంశు ఆర్గనైజేషన్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్.. నాలుగు సంస్థలు అవార్డుకు ఎంపికయ్యాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









