జనవరి 30 నుండి దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్..!!
- January 22, 2025
దోహా: ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి, ఖతార్ టూరిజం, హిజ్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ఆధ్వర్యంలో జరిగిన దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ (DJWE) జరుగనుంది. దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో జనవరి 30 నుండి ఫిబ్రవరి 5 వరకు నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో అల్ ఫర్దాన్ జ్యువెలరీ, అల్ మజేద్ జ్యువెలరీ, అలీ బిన్ అలీ లగ్జరీ, అమిరి జెమ్స్, ఫిఫ్టీ వన్ ఈస్ట్, అల్ ముఫ్తా జ్యువెలరీ, బ్లూ సెలూన్, బ్వ్లగారి, ఆర్ట్స్ అండ్ జెమ్స్కు చెందిన అద్భుతమైన సేకరణలు, వినూత్న డిజైన్లను ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయ ఆభరణాలు, వాచ్ బ్రాండ్ల నుండి తాజా ట్రెండ్లను ప్రదర్శించడంతో పాటు, DJWE అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఖతారీ డిజైనర్ల కోసం ఒక వేదికను అందిస్తుందని ఖతార్ టూరిజం చైర్మన్ హిస్ ఎక్సలెన్సీ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ తెలిపారు.
తాజా వార్తలు
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!







