యూఏఈ పెవిలియన్ను సందర్శించిన హిస్ హైనెస్ ఇసా బిన్ సల్మాన్..!!
- January 22, 2025
మనామా: ఇసా బిన్ సల్మాన్ ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీల బోర్డు ఛైర్మన్, లేబర్ ఫండ్ (తమ్కీన్) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ హిస్ హైనెస్ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని సందర్శించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 55వ వార్షిక సమావేశంలో యూఏఈ పెవిలియన్ ను యూఏఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి, HE మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గెర్గావి, యూఏఈ ప్రతినిధి బృందం సభ్యులతో కలిసి సందర్శించారు. అనంతరం వారితో సమావేశం అయ్యారు. WEFలో ఉన్నత స్థాయి బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి హెచ్హెచ్ షేక్ ఇసా బిన్ సల్మాన్ నాయకత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హిస్ హైనెస్ షేక్ ఇసా బిన్ సల్మాన్.. బహ్రెయిన్ -యూఏఈ మధ్య ఉన్న బలమైన సంబంధాలను సమీక్షించారు. రాబోయే రోజుల్లో వివిధ రంగాల్లో సంబంధాలను పెంపొందించే మార్గాలను కూడా సమావేశంలో చర్చించారు. బహ్రెయిన్ ఆర్థిక మంత్రి, HE షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







