గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘తేనీటి విందు’ ఇచ్చిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
- January 26, 2025
హైదరాబాద్: ఈ రోజు రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఇచ్చిన ‘తేనీటి విందు’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి; తెలంగాణ రాష్ట్ర హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్;కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రి, జి.కిషన్ రెడ్డి; కన్హా శాంతివనం వ్యవస్థాపకులు కమలేష్ డి పటేల్;రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు; పలువురు ఎంపీలు; ఎమ్మెల్యేలు; ఉన్నతాధికారులు; అనేక మంది రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారు.
ముందుగా,ఈ కార్యక్రమంలో ‘గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024’ కు ఎంపికైన సభ్యులకు గవర్నరు చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది.
గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులకు ఎంపికైన సభ్యుల వివరములు:
ప్రత్యేక జీవితకాల సాఫల్య పురస్కారం:
1. డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి, ఐ.ఎఫ్.ఎస్., (పర్యావరణ పరిరక్షణ)
వ్యక్తిగత విభాగము:
2. శ్రీ దుశర్ల సత్యనారాయణ (పర్యావరణ పరిరక్షణ)
3. శ్రీ అరికపూడి రఘు (వికలాంగుల సంక్షేమం)
4. Ms. జీవన్జీ దీప్తి (ఆటలు మరియు క్రీడలు)
5. శ్రీమతి పి.బి. కృష్ణ భారతి (సంస్కృతి)
6. ప్రొఫెసర్ యం.పాండు రంగారావు (సంస్కృతి)
సంస్థాగత విభాగము:
7.ధ్రువాంశ్ ఆర్గనైజేషన్ (పర్యావరణ పరిరక్షణ)
8.ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (వికలాంగుల సంక్షేమం)
9. ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఆటలు మరియు క్రీడలు)
10.సంస్కృతి ఫౌండేషన్ (సంస్కృతి)
తాజా వార్తలు
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి







