కువైట్ లో ట్రాఫిక్ చలాన్ల ఫ్రాడ్.. హెచ్చరికలు జారీ..!!
- January 28, 2025
కువైట్: ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని వచ్చే టెక్స్ట్ మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గత కొన్ని రోజులుగా ఈ తరహా మోసాలు పెరిగాయని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత సందేశాలకు ప్రతిస్పందించడం వల్ల వ్యక్తి తన బ్యాంకు బ్యాలెన్స్ను కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాల చెల్లింపు అధికారిక మార్గాల ద్వారా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సహెల్ దరఖాస్తుల ద్వారా మాత్రమే చెల్లించాలని అధికారులు కోరారు. మెసేజులను పంపినవారి గుర్తింపును ధృవీకరించాల్సిన అవసరం ఉందని, మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ ఫోన్ నంబర్లను ఉపయోగించి ఎలాంటి మెసేజులను పంపదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







