బుక్ కవర్లలో డ్రగ్స్ స్మగ్లింగ్..5ఏళ్ల జైలుశిక్ష, BD3,000 జరిమానా..!!
- January 28, 2025
మనామా: బుక్స్ కవర్ల లోపల దాచి డ్రగ్స్ ను తరలిస్తున్న ఒక ఆసియా వ్యక్తికి ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, BD3,000 జరిమానా విధించింది. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పద పార్శిల్ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా డ్రగ్ విషయం బయటకు వచ్చింది. ఓ ఆసియా దేశం నుండి వచ్చిన ప్యాకేజీని స్కాన్ చేయగా, పుస్తక కవర్లలో దాగి ఉన్న డ్రగ్ ను గుర్తించారు. అందులో 1.3 కిలోగ్రాముల బరువున్న "షాబు" (మెథాంఫేటమిన్) ఉందని నిర్ధారించారు. అనంతరం యాంటీ నార్కోటిక్స్ అధికారులు దానిని ట్రాక్ చేస్తూ.. పార్శిల్ తీసుకున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని కారులో తనిఖీ చేయగా మరో 492.94 గ్రాముల అనుమానిత షాబును గుర్తించారు. బహ్రెయిన్లోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే వ్యవస్థీకృత నెట్వర్క్ లో అతడు ఒక వ్యక్తిగా విచారణలో గుర్తించారు. త్వరలోనే మరింత మందిని అరెస్ట్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









