కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది భారతీయులు మృతి
- June 30, 2016
గల్ఫ్ దేశమైన కువైట్లో ఓ పాత భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఐదురుగు పరిస్థితి విషమంగా ఉందని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. గత వారం గల్ఫ్లోని సెంట్రల్ జైలులో మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా 56 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









