కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది భారతీయులు మృతి

- June 30, 2016 , by Maagulf
కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది భారతీయులు మృతి

గల్ఫ్‌ దేశమైన కువైట్‌లో ఓ పాత భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఐదురుగు పరిస్థితి విషమంగా ఉందని కువైట్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. గత వారం గల్ఫ్‌లోని సెంట్రల్‌ జైలులో మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా 56 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com