దుబాయ్లో ఇండి vs పాకిస్థాన్: విమాన ఛార్జీలు 50% పెరుగుదల..!!
- February 02, 2025
యూఏఈ: ఫిబ్రవరి 23న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్తాన్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమరం సమీపిస్తున్న నేపథ్యంలో విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్లకు విపరీత డిమాండ్ నెలకొన్నది. క్రికెట్ అభిమానులు రాబోయే వారాల్లో బుకింగ్లు -విమాన ఛార్జీలు 20 -50 శాతం మధ్య పెరుగుతాయని, చివరి నిమిషంలో ఛార్జీలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. EaseMyTrip సహ-వ్యవస్థాపకుడు రికాంత్ మాట్లాడుతూ.. “భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో విమానాలు, హోటళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, ఆతిథ్య నగరం అహ్మదాబాద్లో రెసిడెన్సీ సెర్చ్ 1,550 శాతం పెరిగాయి. దుబాయ్కి చివరి నిమిషంలో ఇదే విధమైన స్పైక్ని మేము అంచనా వేస్తున్నాము.’’ అని తెలిపారు.
దుబాయ్లోని హాస్పిటాలిటీ రంగం ఇప్పటికే రద్దీని ఎదుర్కొంటుంది. డీరా, డౌన్టౌన్, దుబాయ్ మెరీనా సమీపంలోని హోటళ్లు అధిక ఆక్యుపెన్సీ రేట్లు పెరుగుతున్నట్లు చెబుతున్నాయి. గరిష్ట డిమాండ్ మ్యాచ్ రోజుకి దగ్గరగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ హోటల్ల బుకింగ్ లు త్వరగా పూర్తవుతున్నాయని.. పామ్ జుమేరా, షేక్ జాయెద్ రోడ్లోని లగ్జరీ ప్రాపర్టీలు ప్రీమియం బుకింగ్లలో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఛార్జీలు, హోటళ్లు వేగంగా పూర్తి అవుతుండటంతో ట్రావెల్ కంపెనీలు అభిమానులను ఆలస్యంగా కాకుండా త్వరగా బుక్ చేసుకోవాలని చెబుతున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







