దుబాయ్లో ఇండి vs పాకిస్థాన్: విమాన ఛార్జీలు 50% పెరుగుదల..!!
- February 02, 2025
యూఏఈ: ఫిబ్రవరి 23న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్తాన్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమరం సమీపిస్తున్న నేపథ్యంలో విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్లకు విపరీత డిమాండ్ నెలకొన్నది. క్రికెట్ అభిమానులు రాబోయే వారాల్లో బుకింగ్లు -విమాన ఛార్జీలు 20 -50 శాతం మధ్య పెరుగుతాయని, చివరి నిమిషంలో ఛార్జీలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. EaseMyTrip సహ-వ్యవస్థాపకుడు రికాంత్ మాట్లాడుతూ.. “భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో విమానాలు, హోటళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, ఆతిథ్య నగరం అహ్మదాబాద్లో రెసిడెన్సీ సెర్చ్ 1,550 శాతం పెరిగాయి. దుబాయ్కి చివరి నిమిషంలో ఇదే విధమైన స్పైక్ని మేము అంచనా వేస్తున్నాము.’’ అని తెలిపారు.
దుబాయ్లోని హాస్పిటాలిటీ రంగం ఇప్పటికే రద్దీని ఎదుర్కొంటుంది. డీరా, డౌన్టౌన్, దుబాయ్ మెరీనా సమీపంలోని హోటళ్లు అధిక ఆక్యుపెన్సీ రేట్లు పెరుగుతున్నట్లు చెబుతున్నాయి. గరిష్ట డిమాండ్ మ్యాచ్ రోజుకి దగ్గరగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ హోటల్ల బుకింగ్ లు త్వరగా పూర్తవుతున్నాయని.. పామ్ జుమేరా, షేక్ జాయెద్ రోడ్లోని లగ్జరీ ప్రాపర్టీలు ప్రీమియం బుకింగ్లలో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఛార్జీలు, హోటళ్లు వేగంగా పూర్తి అవుతుండటంతో ట్రావెల్ కంపెనీలు అభిమానులను ఆలస్యంగా కాకుండా త్వరగా బుక్ చేసుకోవాలని చెబుతున్నారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







