దుబాయ్లో ఇండి vs పాకిస్థాన్: విమాన ఛార్జీలు 50% పెరుగుదల..!!
- February 02, 2025
యూఏఈ: ఫిబ్రవరి 23న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్తాన్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమరం సమీపిస్తున్న నేపథ్యంలో విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్లకు విపరీత డిమాండ్ నెలకొన్నది. క్రికెట్ అభిమానులు రాబోయే వారాల్లో బుకింగ్లు -విమాన ఛార్జీలు 20 -50 శాతం మధ్య పెరుగుతాయని, చివరి నిమిషంలో ఛార్జీలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. EaseMyTrip సహ-వ్యవస్థాపకుడు రికాంత్ మాట్లాడుతూ.. “భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో విమానాలు, హోటళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, ఆతిథ్య నగరం అహ్మదాబాద్లో రెసిడెన్సీ సెర్చ్ 1,550 శాతం పెరిగాయి. దుబాయ్కి చివరి నిమిషంలో ఇదే విధమైన స్పైక్ని మేము అంచనా వేస్తున్నాము.’’ అని తెలిపారు.
దుబాయ్లోని హాస్పిటాలిటీ రంగం ఇప్పటికే రద్దీని ఎదుర్కొంటుంది. డీరా, డౌన్టౌన్, దుబాయ్ మెరీనా సమీపంలోని హోటళ్లు అధిక ఆక్యుపెన్సీ రేట్లు పెరుగుతున్నట్లు చెబుతున్నాయి. గరిష్ట డిమాండ్ మ్యాచ్ రోజుకి దగ్గరగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ హోటల్ల బుకింగ్ లు త్వరగా పూర్తవుతున్నాయని.. పామ్ జుమేరా, షేక్ జాయెద్ రోడ్లోని లగ్జరీ ప్రాపర్టీలు ప్రీమియం బుకింగ్లలో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఛార్జీలు, హోటళ్లు వేగంగా పూర్తి అవుతుండటంతో ట్రావెల్ కంపెనీలు అభిమానులను ఆలస్యంగా కాకుండా త్వరగా బుక్ చేసుకోవాలని చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







