ఎంపీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్..లాయర్ పై కేసు నమోదు..!!
- February 02, 2025
మనామా: బహ్రెయిన్ లో ఓ ఎంపీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లాయర్.. ఈ వారం లోయర్ క్రిమినల్ కోర్ట్ ముందు హాజరు కానున్నారు. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పరువు నష్టం కలిగించారని పార్లమెంటు సభ్యుని (ఎంపీ) పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి సదరు సోషల్ మీడియోలో పోస్ట్ వీడియోను సాక్ష్యంగా సమర్పించారు. ద్వంద్వ పౌరసత్వం కారణంగా మాజీ ఎంపీ మహ్మద్ అల్ హుస్సేనీ తన సీటును కోల్పోయిన తర్వాత గత ఏడాది ముహరక్ గవర్నరేట్లో ఇటీవల జరిగిన ఉపఎన్నికలో అబ్దుల్వాహిద్ ఖరాతా విజయం సాధించారు.
దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన విచారణను ముగించింది. ఈ విచారణలో ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన ఎంపీ నుండి అధికారికంగా స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ప్రాసిక్యూషన్ వివాదం మధ్యలో ఉన్న వీడియో కంటెంట్ను క్షుణ్ణంగా సమీక్షించింది. దాని కంటెంట్ను చట్టవిరుద్ధమైన అంశాలను విశ్లేషించింది. సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత, పబ్లిక్ ప్రాసిక్యూషన్ న్యాయవాదిని విచారణ కోసం దిగువ క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







