ఎంపీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్..లాయర్ పై కేసు నమోదు..!!
- February 02, 2025
మనామా: బహ్రెయిన్ లో ఓ ఎంపీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లాయర్.. ఈ వారం లోయర్ క్రిమినల్ కోర్ట్ ముందు హాజరు కానున్నారు. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పరువు నష్టం కలిగించారని పార్లమెంటు సభ్యుని (ఎంపీ) పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి సదరు సోషల్ మీడియోలో పోస్ట్ వీడియోను సాక్ష్యంగా సమర్పించారు. ద్వంద్వ పౌరసత్వం కారణంగా మాజీ ఎంపీ మహ్మద్ అల్ హుస్సేనీ తన సీటును కోల్పోయిన తర్వాత గత ఏడాది ముహరక్ గవర్నరేట్లో ఇటీవల జరిగిన ఉపఎన్నికలో అబ్దుల్వాహిద్ ఖరాతా విజయం సాధించారు.
దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన విచారణను ముగించింది. ఈ విచారణలో ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన ఎంపీ నుండి అధికారికంగా స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ప్రాసిక్యూషన్ వివాదం మధ్యలో ఉన్న వీడియో కంటెంట్ను క్షుణ్ణంగా సమీక్షించింది. దాని కంటెంట్ను చట్టవిరుద్ధమైన అంశాలను విశ్లేషించింది. సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత, పబ్లిక్ ప్రాసిక్యూషన్ న్యాయవాదిని విచారణ కోసం దిగువ క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేసింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









