శ్రీనగర్లో ఒకేసారి దాదాపు 3వేల మంది ముస్లింలు ఇఫ్తార్ విందులో..
- July 01, 2016
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ఒకేసారి దాదాపు 3వేల మంది ముస్లింలు ఇఫ్తార్ విందులో పాల్గొని తమ ఉపవాసాన్ని విరమించారు. గురువారం సాయంత్రం శ్రీనగర్లో ఈ కార్యక్రమం జరిగింది. లౌడ్బీటిల్.ఇన్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. గత ఏడాది ఇదే సంస్థ ప్రఖ్యాత దాల్ సరస్సు తీరాన ఆసియాలోనే అతి పెద్ద ఇఫ్తార్ విందును ఏర్పాటుచేసింది.
ప్రత్యేకించి అతిథులుగా ఎవరినీ పిలవకుండా అందరూ ఆహ్వానితులేనని ప్రకటించారు. దాంతో అన్ని వర్గాలకు చెందిన ముస్లిం సోదరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పళ్ల రసాలు, ఖర్జూరాలు, రకరకాల స్వీట్లతో ఉపవాసాలు చేసేవారికి తగిన మెనూతో ఈ విందును ఏర్పాటు చేశారు. స్థానిక వ్యాపారస్తులు అంతా కలిసి దీనిని స్పాన్సర్ చేశారు.గత ఏడాది ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఏడువేల మందికి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అతి పెద్ద విందుగా గిన్నిస్ రికార్డు నమోదు చేసింది. కాశ్మీర్లోని దాల్ సరస్సు ఒడ్డున జరిగిన విందులో 3500 మందికి పైగా పాల్గొనడంతో ఆసియాలో అతి పెద్ద విందుగా పేరొందింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







