శ్రీనగర్లో ఒకేసారి దాదాపు 3వేల మంది ముస్లింలు ఇఫ్తార్ విందులో..
- July 01, 2016
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ఒకేసారి దాదాపు 3వేల మంది ముస్లింలు ఇఫ్తార్ విందులో పాల్గొని తమ ఉపవాసాన్ని విరమించారు. గురువారం సాయంత్రం శ్రీనగర్లో ఈ కార్యక్రమం జరిగింది. లౌడ్బీటిల్.ఇన్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. గత ఏడాది ఇదే సంస్థ ప్రఖ్యాత దాల్ సరస్సు తీరాన ఆసియాలోనే అతి పెద్ద ఇఫ్తార్ విందును ఏర్పాటుచేసింది.
ప్రత్యేకించి అతిథులుగా ఎవరినీ పిలవకుండా అందరూ ఆహ్వానితులేనని ప్రకటించారు. దాంతో అన్ని వర్గాలకు చెందిన ముస్లిం సోదరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పళ్ల రసాలు, ఖర్జూరాలు, రకరకాల స్వీట్లతో ఉపవాసాలు చేసేవారికి తగిన మెనూతో ఈ విందును ఏర్పాటు చేశారు. స్థానిక వ్యాపారస్తులు అంతా కలిసి దీనిని స్పాన్సర్ చేశారు.గత ఏడాది ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఏడువేల మందికి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అతి పెద్ద విందుగా గిన్నిస్ రికార్డు నమోదు చేసింది. కాశ్మీర్లోని దాల్ సరస్సు ఒడ్డున జరిగిన విందులో 3500 మందికి పైగా పాల్గొనడంతో ఆసియాలో అతి పెద్ద విందుగా పేరొందింది.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









