మస్కట్ గవర్నరేట్లో పెరిగిన క్రైమ్ రేట్..లేబర్ యాక్ట్ కేసులు టాప్..!!
- February 04, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివేదిక ప్రకారం.. మస్కట్ గవర్నరేట్లో అత్యధికంగా 20,852 కేసులు నమోదయ్యాయి. నార్త్ అల్ బతినా గవర్నరేట్లో 7,500 కేసులు, ధోఫర్ గవర్నరేట్లో 4,457 కేసులు నమోదయ్యాయి. మెజారిటీ కేసులు (32,856) రాయల్ ఒమన్ పోలీసుల నుండి స్వీకరించగా, తరువాత 5,757 కేసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇ-సర్వీసెస్ పోర్టల్ ద్వారా.. 4,142 కేసులు కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా నమోదయ్యాయి. 2024లో ఐదు అత్యంత సాధారణ నేరాల జాబితాలో కార్మిక చట్ట నేరాలు 12,407 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత చెక్కుల నేరాలు (9,699), విదేశీ నివాస చట్టం నేరాలు (9,154), మోసం నేరాలు (5,343) , దొంగతనం- దోపిడీ నేరాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









