సౌదీ అరేబియా-ఇండియా ఇండస్ట్రీయల్ పార్టనర్ షిప్ బలోపేతం..!!
- February 04, 2025
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా పరిశ్రమ, ఖనిజ వనరుల శాఖ మంత్రి బందర్ అల్ఖోరాయేఫ్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ భారత మంత్రులతో సమావేశమయ్యారు. పారిశ్రామిక భాగస్వామ్యాన్ని విస్తరించడం, కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించడం ఈ సమావేశాల లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. భారత పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ - అల్ఖోరాయేఫ్ మధ్య జరిగిన సమావేశంలో, సౌదీ అరేబియాలో వ్యూహాత్మక పారిశ్రామిక రంగాల వృద్ధికి తోడ్పడేందుకు పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాలను విస్తరించడం, నాణ్యమైన పెట్టుబడులను ఆకర్షించడం వంటి మార్గాలపై వారు చర్చించారు. అల్ఖోరాయెఫ్ రెండు దేశాల మధ్య బలమైన ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలను గుర్తుచేశారు.
భారత రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో అల్ఖోరాయేఫ్ విడివిడిగా సమావేశమయ్యారు. పెట్రో కెమికల్స్, ఎరువులు, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, భారీ యంత్రాలు, ఆటోమొబైల్స్, విడిభాగాలు సహా కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చలు దృష్టి సారించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









