స్టాప్ఓవర్ ప్రోగ్రామ్.. జనవరిలో రికార్డుస్థాయిలో విజిటర్స్..!!
- February 06, 2025
దోహా, ఖతార్: ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ విభాగం డిస్కవర్ ఖతార్.. ఆగస్టు 2021లో ఖతార్ స్టాప్ఓవర్ ప్రోగ్రామ్ పునఃప్రారంభించింది. ఆ తర్వాత మొదటిసారిగా ఒకే నెలలో 10,000 మంది స్టాప్ఓవర్ సందర్శకులతో కీలక మైలురాయిని సాధించింది. జనవరి 2025లో ప్రోగ్రామ్ కింద 10,500 కంటే ఎక్కువ మంది సందర్శకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జనవరి 2024లో 6,651 మంది సందర్శకులు రాగా, 2024 మార్చి-జనవరి (2025) నాటికి 165% వృద్ధిని నమోదు చేసింది.అదే సమయంలో ఈ కార్యక్రమం హోటల్ బుకింగ్లలో అసాధారణమైన వృద్ధి నమోదైంది.ఈ సంవత్సరం ఇప్పటి వరకు 100,000 రూమ్ లు బుక్ అయ్యాయి.ఇది గత సంవత్సరం కంటే రెట్టింపు అని డిస్కవర్ కతార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్టీవెన్ రేనాల్డ్స్ తెలిపారు. ఖతార్ ఎయిర్వేస్ విస్తృతమైన నెట్వర్క్ను 170 గమ్యస్థానాలకు పెంచామని.. డిస్కవర్ ఖతార్లో, సాంస్కృతిక ఆవిష్కరణ, ప్రపంచ స్థాయి ఆతిథ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులకు మరపురాని అనుభవాలను అనుకూలమైన ప్యాకేజీలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







