ఇసా టౌన్లో మూడు కీలక రోడ్ ప్రాజెక్టులు పూర్తి..!!
- February 06, 2025
మనామా: 2024లో సదరన్ గవర్నరేట్లో మూడు ముఖ్యమైన రోడ్ ప్రాజెక్ట్లను పూర్తి చేస్తున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇందులో ఇసా టౌన్ విద్యా ప్రాంతంలో రహదారి సామర్థ్యాన్ని 300% పెంచుతుందని పేర్కొన్నారు. ప్రధాన ప్రాజెక్ట్ రోడ్లు 4109, 4013ను మెరుగుపరచడంతోపాటు, ఇసా టౌన్ విద్యా ప్రాంతంలో బహ్రెయిన్ యూత్ అవెన్యూ అభివృద్ధి యొక్క రెండవ దశను కలిగి ఉంది. రహదారి 4109 డ్యూయల్ క్యారేజ్వేగా మారింది. మెరుగైన ట్రాఫిక్ కోసం ప్రతి దిశలో రెండు లేన్లను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ రహదారి సామర్థ్యాన్ని గంటకు 1,000 వాహనాల నుండి గంటకు 3,000 వాహనాలకు పెంచిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రెండవ ప్రాజెక్ట్ BD428,000 మొత్తం పెట్టుబడితో రిఫాలోని 915, 916 బ్లాక్లలో రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టిందన్నారు. వాటితోపాటు ప్రాజెక్ట్ కొత్త పార్కింగ్ స్థలాలను సృష్టించడం, మెరుగైన ట్రాఫిక్ భద్రతా చర్యలను అమలు చేయడం, స్పష్టమైన ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేయడం, మెరుగైన భద్రతను సులభతరం చేయనుందని తెలిపారు. మూడవ ప్రాజెక్ట్ ఇసా టౌన్లోని బ్లాక్ 816లో అనేక రోడ్ల పునరుద్ధరణ, అభివృద్ధిని కలిగి ఉంది.
తాజా వార్తలు
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!







