ఒమన్-ఇండియా..పెట్టుబడి అవకాశాలపై సమీక్ష..!!
- February 07, 2025
న్యూఢిల్లీ: ఆహారం, ఔషధాలు, వైద్య ఉత్పత్తులు, వ్యవసాయం, సమాచార సాంకేతికత, పెట్రోకెమికల్స్, ఇంధనం వంటి వివిధ కీలక రంగాలలో రెండు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలపై ఇండియాలోని న్యూఢిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయం ఇంటరాక్టివ్ రౌండ్టేబుల్ సమావేశాలను నిర్వహించింది. ఆర్థిక, పెట్టుబడి సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ సమావేశాల లక్ష్యమని తెలిపింది. ఈ సమావేశాల్లో పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు. ఒమన్లోని వ్యాపార వాతావరణాన్ని, అలాగే ఒమన్లోని ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఫ్రీ జోన్లు , పారిశ్రామిక నగరాల్లో విదేశీ పెట్టుబడిదారులకు అందించే ప్రముఖ ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ఈ సందర్భంగా ఒమన్ - ఇండియా మధ్య ఆర్థిక సంబంధాలపై సమీక్షించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







