దొంగతనాలు చేసే 15 మంది ముఠా సభ్యులని అరెస్టు చేసిన పోలీసులు

- July 02, 2016 , by Maagulf
దొంగతనాలు చేసే 15 మంది  ముఠా సభ్యులని అరెస్టు చేసిన పోలీసులు

రాజధానిలో 80 దొంగతనాలకు పైగా సంబంధం ఉన్న ఒక దొంగల ముఠా సభ్యులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసు మీడియా ప్రతినిధి కల్నల్ ఫరజ్  అల్ మైమన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ముఠా వ్యతిరేకంగా అనేక  ఫిర్యాదులు పోలీసులకు అందాయని తెలిపారు.రియాద్ ప్రాంతంలో వరుసగా గొలుసుకట్టు దొంగతనాలకు పాల్గొంటున్న వీరిని అరెస్టు చేసినట్లు ఆయన తెలియచేస్తూ, ఈ దొంగలు 20 ఏళ్లు 30 ఏళ్ల వయస్సులోపు  ఉన్నారని ఆయన తెలియచేస్తూ, వారి దేశాలు బహిర్గతం కాకుండా గోప్యంగా ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ దొంగల ముఠా, రియాద్ దక్షిణాన వీధుల్లో బాటసారులను నుండి విలువైన వస్తువులు దొంగిలిస్తారని  ట్రక్ డ్రైవర్లని దారి కాచి  వారి నగదు మరియు విలువైన వస్తువులని దొంగిలించడం, అలాగే  నిలిపి ఉంచిన  వాహనాల నుండి విలువైన దొంగిలిండం వీరికి  వెన్నతో పెట్టిన విద్య. ఈ దొంగతనాలతో పాటు, ఈ ముఠా సభ్యులు కత్తులతో అమాయక పాదచారులను బెదిరించి  వారి ఆస్తులను దోపిడీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీసులు ఈ నేరస్థులు పట్టుకోవాలని ఒక ఉన్నత స్థాయి బృందంని ఉపయోగించి ఒక వ్యూహం సిద్ధం చేశారని అల్ మైమన్ అన్నారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాజ్యంలో  నేరాలు ఎక్కువ కాలం నివాసితం చేసినవారు అక్రమ నివాసితులు ఉన్న ప్రాంతాలలో జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వం  అంకితభావంతో చేసిన కృషితత్ఫలితంగా,వారి వీసాలు ఎక్కువకాలం చేసిన నివాసితులు వ్యతిరేకంగా దాని ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అటువంటి వారిని అరెస్టు చేసి  ఆ జైళ్లలో నిర్బంధంలో ఉంచి మరియు వారు తమ తమ నేరాల స్థాయిని నిర్ధారించేందుకు ఒక అధికారిక విచారణ అనంతరం దేశమునుండి పంపించేస్తారని తెలిపారు. ప్రాంతం నుండి అక్రమంగా దేశంలోకి వచ్చేవారిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com