ఎత్తైన దుబాయ్ మెరీనా నివాస భవనంలో అగ్నిప్రమాదం..!!
- February 18, 2025
యూఏఈ: దుబాయ్ మెరీనాలోని రెసిడెన్షియల్ టవర్లో సోమవారం చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. భవనం పైకప్పుపై ఉన్న ఎయిర్ కండిషనింగ్ కూలర్లలో మంటలు చెలరేగాయని అధికార యంత్రాంగం పేర్కొంది. ఎత్తైన టవర్ పై నుండి పొగలు వస్తున్నట్లు సోషల్ మీడియాలోని షేర్ అవుతున్నాయి.
మెరీనాలో నివసించే దుబాయ్ నివాసి MA, సంఘటన జరిగిన సమయంలో మధ్యాహ్నం సమయంలో పోలీసు సైరన్ల శబ్దం వినిపించిందని చెప్పారు. ఆన్లైన్లో షేర్ చేయబడిన ఒక వీడియో మెట్రో స్టేషన్కు సమీపంలో ఉన్న టవర్ నుండి దట్టమైన పొగలు వస్తున్నట్లు కనిపించింది.
మధ్యాహ్నం 12:20 గంటలకు ఘటన జరిగిన ఐదు నిమిషాల తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది వెంటనే తరలింపు, అగ్నిమాపక కార్యకలాపాలను ప్రారంభించారు. వారు మధ్యాహ్నం 12:44 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







