తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం
- February 20, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్కు రూ.170.99 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల చేశారు. 2024లో వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా ప్రభావితమైన రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా రాష్ట్రాలకు ఈ నిధులను అందజేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గత కొంతకాలంగా వరదలు, తుఫానులు, భారీ వర్షాల వల్ల తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో గోదావరి, కృష్ణా నదుల్లో వచ్చిన వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి, వేలాది కుటుంబాలు తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఇదే విధంగా, తెలంగాణలోనూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లకు, రహదారులకు, వంతెనలకు భారీగా నష్టం జరిగింది. ఈ నిధులు మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు, పునర్నిర్మాణ పనులకు ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!