తెలుగులోకి వస్తున్న తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్..
- February 21, 2025
మహత్ రాఘవేంద్ర, దేవిక, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్సిరీస్ ఎమోజీ. సెన్ రంగసామీ ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించారు. ఈ తమిళ రొమాంటిక్ సిరీస్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ వెబ్సిరీస్ను అదే పేరుతో స్ట్రీమింగ్ చేయనుంది. ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను విడుదల చేసింది.
తమిళంలో విడుదలైన రెండు సంవత్సరాల తెలుగులో వస్తుంది. ఓ జంట మధ్య ఏర్పడిన పరిచయం వివాహానికి ఎలా దారి తీసింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి విడాకులు ఇచ్చి మరో అమ్మాయితో ఆ యువకుడు ఎందుకు జీవించాలని అనుకున్నాడు?
ఆ తరువాత విడాకులు తీసుకున్న అమ్మామే మళ్లీ అతడి జీవితంలోకి ఎలా వచ్చింది? అనే కాన్సెప్ట్తో ఈ వెబ్సిరీస్ను రూపొందించారు. తమిళంలో ఈ వెబ్సిరీస్ మంచి ఆదరణను సొంతం చేసుకుంది.
కాగా..ఈ వెబ్సిరీస్ నటించిన మానస చౌదరి తెలుగు అమ్మాయి కావడం విశేషం. బబుల్గమ్ చిత్రంతో అమ్మడు టాలీవుడ్లోనూ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సుమ కనకాల కొడుకు రోషన్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీలోనూ ఓ కీలక పాత్రలో నటించింది మానస.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







