కువైట్ స్పోర్ట్స్ డేలో పాల్గొన్న 21వేల మంది..!!
- February 23, 2025
కైట్: కువైట్ స్పోర్ట్స్ డే రెండవ ఎడిషన్, పబ్లిక్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్ ద్వారా షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబాహ్ కాజ్వేలో నిర్వహించిన స్పోర్ట్స్ డేలో 21వేలమంది పాల్గొన్నారు. ఈవెంట్లో 5 కి.మీ నడక రేస్, 20 కి.మీ సైక్లింగ్ రేసులో భాగంగా ఇక్కడ పోటీదారులు షువైఖ్ పోర్ట్ నుండి షేక్ జాబర్ కాజ్వే ప్రారంభం నుండి బ్రిడ్జి దక్షిణ ద్వీపం అయిన ముగింపు రేఖ వరకు కాలినడకన, సైకిళ్లపై బయలుదేరారు.
కువైట్ సమాచార శాఖ మంత్రి, యువజన వ్యవహారాల సహాయ మంత్రి అబ్దుల్రహ్మాన్ అల్-ముతైరీ రేసును అధికారికంగా ప్రారంభించారు. కువైట్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఫెడరేషన్ అధ్యక్షుడు మహమూద్ అబెల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మాజీ ప్రధాని షేక్ మహ్మద్ సబా అల్-సలేం వరుసగా రెండో సంవత్సరం సైక్లింగ్ రేసులో మాజీ మంత్రి దావూద్ మరాఫీతో కలిసి పాల్గొన్నారు. ఈవెంట్లో 20-కిలోమీటర్ల సైక్లింగ్ రేసు ఉంటుంది. దాని తర్వాత 5-కిలోమీటర్ల నడక ఉంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







