ప్రభుత్వ ఉద్యోగులకు రమదాన్ పని వేళలను ప్రకటించిన యూఏఈ..!!
- February 23, 2025
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసం కోసం యూఏఈ పనివేళలను ప్రకటించింది. మంత్రిత్వ శాఖలు , సమాఖ్య సంస్థల ఉద్యోగులకు అధికారిక వర్కింగ్ అవర్స్ ను ప్రకటించారు. పనివేళలు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.30 గంటలకు ముగుస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (ఫార్) ప్రకటించింది.
ఇక శుక్రవారాల్లో, పని వేళలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని, వారి ఉద్యోగ స్వభావానికి ఇతరత్రా అవసరమయ్యే వారికి తప్ప ఈ సమయ నిబంధనలను వర్తించవని యంత్రాంగం తెలిపింది.
వీటితోపాటు ఆమోదించబడిన మార్గదర్శకాల ప్రకారం.. ఎంటిటీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 70 శాతానికి మించకుండా పరిమితితో రమదాన్ సందర్భంగా శుక్రవారం రిమోట్గా ఉద్యోగులు పని చేయడానికి వారు వెసులుబాటును మంజూరు చేసింది.
రమదాన్ నెలవంక కనిపించాక ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ముస్లింలు ఉపవాసం పారంభిస్తారు. మార్చి 1న రమదాన్ మాసం ప్రారంభమవుతుందని అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర కేంద్రం (ఐఎసి) తెలిపింది. ఆ రోజున ఇస్లామిక్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో నెలవంక టెలిస్కోప్ ద్వారా కనిపించవచ్చని, అమెరికాలోని విస్తృత ప్రాంతాల్లో ఇది కంటితో కనిపిస్తుందని సెంటర్ డైరెక్టర్ మహ్మద్ షౌకత్ ఒదేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







