ప్రభుత్వ ఉద్యోగులకు రమదాన్ పని వేళలను ప్రకటించిన యూఏఈ..!!
- February 23, 2025
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసం కోసం యూఏఈ పనివేళలను ప్రకటించింది. మంత్రిత్వ శాఖలు , సమాఖ్య సంస్థల ఉద్యోగులకు అధికారిక వర్కింగ్ అవర్స్ ను ప్రకటించారు. పనివేళలు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.30 గంటలకు ముగుస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (ఫార్) ప్రకటించింది.
ఇక శుక్రవారాల్లో, పని వేళలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని, వారి ఉద్యోగ స్వభావానికి ఇతరత్రా అవసరమయ్యే వారికి తప్ప ఈ సమయ నిబంధనలను వర్తించవని యంత్రాంగం తెలిపింది.
వీటితోపాటు ఆమోదించబడిన మార్గదర్శకాల ప్రకారం.. ఎంటిటీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 70 శాతానికి మించకుండా పరిమితితో రమదాన్ సందర్భంగా శుక్రవారం రిమోట్గా ఉద్యోగులు పని చేయడానికి వారు వెసులుబాటును మంజూరు చేసింది.
రమదాన్ నెలవంక కనిపించాక ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ముస్లింలు ఉపవాసం పారంభిస్తారు. మార్చి 1న రమదాన్ మాసం ప్రారంభమవుతుందని అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర కేంద్రం (ఐఎసి) తెలిపింది. ఆ రోజున ఇస్లామిక్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో నెలవంక టెలిస్కోప్ ద్వారా కనిపించవచ్చని, అమెరికాలోని విస్తృత ప్రాంతాల్లో ఇది కంటితో కనిపిస్తుందని సెంటర్ డైరెక్టర్ మహ్మద్ షౌకత్ ఒదేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







