ఒమన్ లో విద్యారంగ అభివృద్ధికి హిజ్ మెజెస్టి ప్రత్యేక కృషి..!!
- February 24, 2025
మస్కట్: భావితరాలను నిర్మించడంలో ఉపాధ్యాయుల పాత్రను ప్రతిబింబిస్తూ విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న ఒమానీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ విద్యా రంగానికి చాలా ప్రాముఖ్యతనిస్తారని, గత సంవత్సరం నవంబర్లో సుల్తాన్ ఫైసల్ బిన్ టర్కీ స్కూల్కు హిజ్ మెజెస్టి సందర్శించడం విద్యారంగంపై ఆయనకున్న గొప్ప ఆసక్తికి నిదర్శనం అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నాణ్యమైన శిక్షణను అందించడానికి, ప్రపంచ పురోగతికి అనుగుణంగా వారికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని అందించడానికి చిత్తశుద్ధితో పని చేసే ఉపాధ్యాయుల ప్రయత్నాలకు ఈ సందర్భంగా అభినందించారు.
ఒమన్ సుల్తానేట్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, నిర్వాహకుల సంఖ్య 74,316కి చేరుకుంది. 2020-2024లో 3.1% వృద్ధి రేటుతో 1,223 ప్రైవేట్ పాఠశాలల్లో, ఉపాధ్యాయులు, నిర్వాహకుల సంఖ్య 22,539కి చేరుకుంది. ఉపాధ్యాయులు, పాఠశాల పరిపాలనాధికారులు, సూపర్వైజర్లు, సహాయక ఉద్యోగాల వర్గాల నుండి ఉన్నత డిగ్రీలు పొందిన ఒమానీ ఉపాధ్యాయుల కోసం స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ద్వారా పర్యవేక్షించబడే వర్గాల సంఖ్య 4,250కి చేరుకుందని, ఇందులో మాస్టర్స్ డిగ్రీతో 3,721 మంది, డాక్టరేట్ డిగ్రీతో 529 మంది ఉన్నారని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. అసలు ఎలా ప్రారంభమైంది?
- పదేళ్లలో 100 కొత్త ఎయిర్పోర్టులు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- ఈద్ అల్ అధా సందర్భంగా 230 మంది ఖైదీలకు అజ్మాన్ రూలర్ క్షమాభిక్ష
- బాల్య వివాహాలను ప్రేరేపించినందుకు జైలు శిక్ష, Dh5 మిలియన్ల జరిమానా..!!
- గుండెపోటు.. నలుగురు హజ్ యాత్రికులు రక్షించిన వైద్య బృందాలు..!!
- యూఏఈ లాటరీ డ్రా..విజేత IDలు ఇవే..!!
- మానవ అక్రమ రవాణా కేసులో ఆసియా మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ అధాకు భారతీయ మేకలకు డిమాండ్..!!
- జలీబ్లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం.. 5 మంది మృతి..!!
- మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!









