ఒమన్ లో విద్యారంగ అభివృద్ధికి హిజ్ మెజెస్టి ప్రత్యేక కృషి..!!
- February 24, 2025
మస్కట్: భావితరాలను నిర్మించడంలో ఉపాధ్యాయుల పాత్రను ప్రతిబింబిస్తూ విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న ఒమానీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ విద్యా రంగానికి చాలా ప్రాముఖ్యతనిస్తారని, గత సంవత్సరం నవంబర్లో సుల్తాన్ ఫైసల్ బిన్ టర్కీ స్కూల్కు హిజ్ మెజెస్టి సందర్శించడం విద్యారంగంపై ఆయనకున్న గొప్ప ఆసక్తికి నిదర్శనం అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నాణ్యమైన శిక్షణను అందించడానికి, ప్రపంచ పురోగతికి అనుగుణంగా వారికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని అందించడానికి చిత్తశుద్ధితో పని చేసే ఉపాధ్యాయుల ప్రయత్నాలకు ఈ సందర్భంగా అభినందించారు.
ఒమన్ సుల్తానేట్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, నిర్వాహకుల సంఖ్య 74,316కి చేరుకుంది. 2020-2024లో 3.1% వృద్ధి రేటుతో 1,223 ప్రైవేట్ పాఠశాలల్లో, ఉపాధ్యాయులు, నిర్వాహకుల సంఖ్య 22,539కి చేరుకుంది. ఉపాధ్యాయులు, పాఠశాల పరిపాలనాధికారులు, సూపర్వైజర్లు, సహాయక ఉద్యోగాల వర్గాల నుండి ఉన్నత డిగ్రీలు పొందిన ఒమానీ ఉపాధ్యాయుల కోసం స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ద్వారా పర్యవేక్షించబడే వర్గాల సంఖ్య 4,250కి చేరుకుందని, ఇందులో మాస్టర్స్ డిగ్రీతో 3,721 మంది, డాక్టరేట్ డిగ్రీతో 529 మంది ఉన్నారని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







