బిర్కత్ అల్ అవామెర్లో అభివృద్ధి పనులు..ప్రారంభించిన ‘అష్ఘల్’..!!
- February 24, 2025
దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్ఘల్' బిర్కత్ అల్ అవామెర్లో రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ప్రాంతంలోని ఖతార్ ఎకనామిక్ జోన్స్ కంపెనీకి చెందిన లాజిస్టిక్స్ జోన్ "మనాటెక్"కు సేవలు అందిస్తుంది. అంతర్గత వీధులను అభివృద్ధి చేయడం, ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడం, లాజిస్టిక్స్ జోన్ అవసరాలు, భవిష్యత్తులో ఊహించిన పట్టణ వృద్ధికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఇది లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాజెక్ట్ దోహాకు దక్షిణంగా దాదాపు 41కిమీ దూరంలో జోన్ 91లో ఉంది. ప్రాజెక్ట్ పనులు నాలుగు జోన్లుగా విభజించారు. అష్ఘల్ రోడ్స్ ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్ యొక్క సౌత్ ఏరియా విభాగంలో ప్రాజెక్ట్ ఇంజనీర్ మహ్మద్ అబ్దుల్కరీమ్ అల్యాఫీ మాట్లాడుతూ.. 2027 క్యూ3లో పూర్తి చేయనున్న ఈ ప్రాజెక్ట్ బిర్కత్ అల్ అవామెర్ ప్రాంతంలోని లాజిస్టిక్స్ జోన్లోని దాదాపు 880 సబ్డివిజన్లకు సేవలను అందజేస్తుందని, అంతర్లీనంగా రోడ్ల నెట్వర్క్ను అందించడం ద్వారా రోడ్ల నెట్వర్క్ను మెరుగుపరుస్తుందన్నారు. అలాగే అత్యవసర అవసరాల కోసం 27,000-క్యూబిక్-మీటర్ల వర్షపు నీటి నిల్వ సరస్సును నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. అసలు ఎలా ప్రారంభమైంది?
- పదేళ్లలో 100 కొత్త ఎయిర్పోర్టులు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- ఈద్ అల్ అధా సందర్భంగా 230 మంది ఖైదీలకు అజ్మాన్ రూలర్ క్షమాభిక్ష
- బాల్య వివాహాలను ప్రేరేపించినందుకు జైలు శిక్ష, Dh5 మిలియన్ల జరిమానా..!!
- గుండెపోటు.. నలుగురు హజ్ యాత్రికులు రక్షించిన వైద్య బృందాలు..!!
- యూఏఈ లాటరీ డ్రా..విజేత IDలు ఇవే..!!
- మానవ అక్రమ రవాణా కేసులో ఆసియా మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ అధాకు భారతీయ మేకలకు డిమాండ్..!!
- జలీబ్లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం.. 5 మంది మృతి..!!
- మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!









