రియాద్ లోని 15 స్వ్కేర్స్ కు సౌదీ రూలర్స్ పేరు..ఆదేశించిన కింగ్ సల్మాన్..!!
- February 24, 2025
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ ప్రతిపాదనను అనుసరించి సౌదీ అరేబియాలోని ఇమామ్లు, రాజుల పేర్లను రియాద్లోని 15 ప్రధాన కూడళ్లకు పెట్టాలని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 22న కింగ్డమ్ వార్షిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈమేరకు నిర్ణయించారు. గత మూడు శతాబ్దాలుగా దేశ పునాది, ఏకీకరణ, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సౌదీ పాలకుల వారసత్వాన్ని గౌరవించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇమామ్ మొహమ్మద్ బిన్ సౌద్, ఇమామ్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్, ఇమామ్ సౌద్ బిన్ అబ్దులాజీజ్, ఇమామ్ అబ్దుల్లా బిన్ సౌద్, ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా, ఇమామ్ ఫైసల్ బిన్ టర్కీ, ఇమామ్ అబ్దుల్లా బిన్ ఫైసల్, ఇమామ్ అబ్దుల్లా బిన్ ఫైసల్, కింగ్ అబ్దుల్ అజీజ్, కింగ్ సౌద్, కింగ్ ఫైసల్, కింగ్ ఖలీద్, కింగ్ ఫహద్, కింగ్ అబ్దుల్లా, కింగ్ సల్మాన్లతో సహా ఆధునిక రాజ్య నిర్మాణంలో భాగస్వామ్యులైన సౌదీ రాజుల పేర్లను పెట్టనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







