రియాద్ లోని 15 స్వ్కేర్స్ కు సౌదీ రూలర్స్ పేరు..ఆదేశించిన కింగ్ సల్మాన్..!!
- February 24, 2025
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ ప్రతిపాదనను అనుసరించి సౌదీ అరేబియాలోని ఇమామ్లు, రాజుల పేర్లను రియాద్లోని 15 ప్రధాన కూడళ్లకు పెట్టాలని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 22న కింగ్డమ్ వార్షిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈమేరకు నిర్ణయించారు. గత మూడు శతాబ్దాలుగా దేశ పునాది, ఏకీకరణ, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సౌదీ పాలకుల వారసత్వాన్ని గౌరవించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇమామ్ మొహమ్మద్ బిన్ సౌద్, ఇమామ్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్, ఇమామ్ సౌద్ బిన్ అబ్దులాజీజ్, ఇమామ్ అబ్దుల్లా బిన్ సౌద్, ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా, ఇమామ్ ఫైసల్ బిన్ టర్కీ, ఇమామ్ అబ్దుల్లా బిన్ ఫైసల్, ఇమామ్ అబ్దుల్లా బిన్ ఫైసల్, కింగ్ అబ్దుల్ అజీజ్, కింగ్ సౌద్, కింగ్ ఫైసల్, కింగ్ ఖలీద్, కింగ్ ఫహద్, కింగ్ అబ్దుల్లా, కింగ్ సల్మాన్లతో సహా ఆధునిక రాజ్య నిర్మాణంలో భాగస్వామ్యులైన సౌదీ రాజుల పేర్లను పెట్టనున్నారు.
తాజా వార్తలు
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. అసలు ఎలా ప్రారంభమైంది?
- పదేళ్లలో 100 కొత్త ఎయిర్పోర్టులు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- ఈద్ అల్ అధా సందర్భంగా 230 మంది ఖైదీలకు అజ్మాన్ రూలర్ క్షమాభిక్ష
- బాల్య వివాహాలను ప్రేరేపించినందుకు జైలు శిక్ష, Dh5 మిలియన్ల జరిమానా..!!
- గుండెపోటు.. నలుగురు హజ్ యాత్రికులు రక్షించిన వైద్య బృందాలు..!!
- యూఏఈ లాటరీ డ్రా..విజేత IDలు ఇవే..!!
- మానవ అక్రమ రవాణా కేసులో ఆసియా మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ అధాకు భారతీయ మేకలకు డిమాండ్..!!
- జలీబ్లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం.. 5 మంది మృతి..!!
- మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!









