రానున్న 3 రోజులు ఏపీ ప్రజలు జాగ్రత్త
- February 24, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.వాయువ్య భారతదేశం నుంచి వస్తున్న పొడిగాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.గత ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 38.5°C ఉష్ణోగ్రత నమోదైంది.వేసవికి ముందే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడం కొంత ఆందోళన కలిగిస్తోంది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో మరింత తీవ్రమైన ఎండలు నమోదయ్యే అవకాశముంది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల ప్రజలు డీహైడ్రేషన్, తలనొప్పి, ఒళ్లు పట్టేయడం లాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య ఎండ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు.
వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి బట్టలు ధరించడం, విటమిన్ సమృద్ధిగా ఉండే పండ్లు, పదార్థాలు తినడం ఆరోగ్యానికి మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండే సమయాల్లో బయటికి వెళ్లకుండా ఉండడం, అవసరమైతే గొడుగు లేదా టోపీ వాడుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







