రానున్న 3 రోజులు ఏపీ ప్రజలు జాగ్రత్త
- February 24, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.వాయువ్య భారతదేశం నుంచి వస్తున్న పొడిగాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.గత ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 38.5°C ఉష్ణోగ్రత నమోదైంది.వేసవికి ముందే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడం కొంత ఆందోళన కలిగిస్తోంది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో మరింత తీవ్రమైన ఎండలు నమోదయ్యే అవకాశముంది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల ప్రజలు డీహైడ్రేషన్, తలనొప్పి, ఒళ్లు పట్టేయడం లాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య ఎండ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు.
వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి బట్టలు ధరించడం, విటమిన్ సమృద్ధిగా ఉండే పండ్లు, పదార్థాలు తినడం ఆరోగ్యానికి మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండే సమయాల్లో బయటికి వెళ్లకుండా ఉండడం, అవసరమైతే గొడుగు లేదా టోపీ వాడుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- పదేళ్లలో 100 కొత్త ఎయిర్పోర్టులు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- ఈద్ అల్ అధా సందర్భంగా 230 మంది ఖైదీలకు అజ్మాన్ రూలర్ క్షమాభిక్ష
- బాల్య వివాహాలను ప్రేరేపించినందుకు జైలు శిక్ష, Dh5 మిలియన్ల జరిమానా..!!
- గుండెపోటు.. నలుగురు హజ్ యాత్రికులు రక్షించిన వైద్య బృందాలు..!!
- యూఏఈ లాటరీ డ్రా..విజేత IDలు ఇవే..!!
- మానవ అక్రమ రవాణా కేసులో ఆసియా మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ అధాకు భారతీయ మేకలకు డిమాండ్..!!
- జలీబ్లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం.. 5 మంది మృతి..!!
- మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్









