దుబాయ్ లో 254 ఈ-స్కూటర్ ప్రమాదాలు..10 మంది మృతి..!!
- February 25, 2025
దుబాయ్: గత సంవత్సరం దుబాయ్లో సైకిళ్ళు, ఇ-స్కూటర్లకు సంబంధించిన 254 ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 10 మంది మరణించగా, 259 మంది గాయపడ్డారు. దుబాయ్ పోలీసులు మరియు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) నిర్వహించిన అవగాహన ప్రచారం సందర్భంగా ఈ మేరకు డేటాను వెల్లడించారు.
దుబాయ్లోని ఏడు ప్రధాన ప్రాంతాలు మెరీనా, అల్ బర్షా, అల్ రుక్న్, అల్ ముర్ఖాబాత్, అల్ సత్వా, ఖలీద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్, అల్ కరామాలలో సైక్లిస్టులు, ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలను పాటించడంలో విఫలమైతే జరిమానాలు విధించబడతాయని అధికారులు చెప్పారు. 60 కి.మీ/గం కంటే ఎక్కువ వేగ పరిమితులు ఉన్న రోడ్లపై సైక్లింగ్ చేస్తున్నప్పుడు లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ను ఉపయోగిస్తున్నప్పుడు నిబంధనలు పాటించక పోతే 300 దిర్హామ్ల జరిమానా విధించబడుతుంది. RTA పేర్కొన్న సాంకేతిక అవసరాలను పాటించకపోతే Dh200 జరిమానా విధించబడుతుందని దుబాయ్ పోలీస్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ మెహిర్ అల్ మజ్రౌయి హెచ్చరించారు. దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా 'పోలీస్ ఐ' సేవ ద్వారా లేదా 901లో 'వీ ఆర్ ఆల్ పోలీస్' సేవకు కాల్ చేయడం ద్వారా ఏదైనా ప్రతికూల ప్రవర్తనలు లేదా ప్రమాదకర చర్యలను నివేదించాలని ఆయన ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







