దుబాయ్ లో 254 ఈ-స్కూటర్ ప్రమాదాలు..10 మంది మృతి..!!
- February 25, 2025
దుబాయ్: గత సంవత్సరం దుబాయ్లో సైకిళ్ళు, ఇ-స్కూటర్లకు సంబంధించిన 254 ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 10 మంది మరణించగా, 259 మంది గాయపడ్డారు. దుబాయ్ పోలీసులు మరియు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) నిర్వహించిన అవగాహన ప్రచారం సందర్భంగా ఈ మేరకు డేటాను వెల్లడించారు.
దుబాయ్లోని ఏడు ప్రధాన ప్రాంతాలు మెరీనా, అల్ బర్షా, అల్ రుక్న్, అల్ ముర్ఖాబాత్, అల్ సత్వా, ఖలీద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్, అల్ కరామాలలో సైక్లిస్టులు, ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలను పాటించడంలో విఫలమైతే జరిమానాలు విధించబడతాయని అధికారులు చెప్పారు. 60 కి.మీ/గం కంటే ఎక్కువ వేగ పరిమితులు ఉన్న రోడ్లపై సైక్లింగ్ చేస్తున్నప్పుడు లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ను ఉపయోగిస్తున్నప్పుడు నిబంధనలు పాటించక పోతే 300 దిర్హామ్ల జరిమానా విధించబడుతుంది. RTA పేర్కొన్న సాంకేతిక అవసరాలను పాటించకపోతే Dh200 జరిమానా విధించబడుతుందని దుబాయ్ పోలీస్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ మెహిర్ అల్ మజ్రౌయి హెచ్చరించారు. దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా 'పోలీస్ ఐ' సేవ ద్వారా లేదా 901లో 'వీ ఆర్ ఆల్ పోలీస్' సేవకు కాల్ చేయడం ద్వారా ఏదైనా ప్రతికూల ప్రవర్తనలు లేదా ప్రమాదకర చర్యలను నివేదించాలని ఆయన ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- కువైట్లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







