దుబాయ్ లో 254 ఈ-స్కూటర్ ప్రమాదాలు..10 మంది మృతి..!!
- February 25, 2025
దుబాయ్: గత సంవత్సరం దుబాయ్లో సైకిళ్ళు, ఇ-స్కూటర్లకు సంబంధించిన 254 ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 10 మంది మరణించగా, 259 మంది గాయపడ్డారు. దుబాయ్ పోలీసులు మరియు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) నిర్వహించిన అవగాహన ప్రచారం సందర్భంగా ఈ మేరకు డేటాను వెల్లడించారు.
దుబాయ్లోని ఏడు ప్రధాన ప్రాంతాలు మెరీనా, అల్ బర్షా, అల్ రుక్న్, అల్ ముర్ఖాబాత్, అల్ సత్వా, ఖలీద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్, అల్ కరామాలలో సైక్లిస్టులు, ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలను పాటించడంలో విఫలమైతే జరిమానాలు విధించబడతాయని అధికారులు చెప్పారు. 60 కి.మీ/గం కంటే ఎక్కువ వేగ పరిమితులు ఉన్న రోడ్లపై సైక్లింగ్ చేస్తున్నప్పుడు లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ను ఉపయోగిస్తున్నప్పుడు నిబంధనలు పాటించక పోతే 300 దిర్హామ్ల జరిమానా విధించబడుతుంది. RTA పేర్కొన్న సాంకేతిక అవసరాలను పాటించకపోతే Dh200 జరిమానా విధించబడుతుందని దుబాయ్ పోలీస్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ మెహిర్ అల్ మజ్రౌయి హెచ్చరించారు. దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా 'పోలీస్ ఐ' సేవ ద్వారా లేదా 901లో 'వీ ఆర్ ఆల్ పోలీస్' సేవకు కాల్ చేయడం ద్వారా ఏదైనా ప్రతికూల ప్రవర్తనలు లేదా ప్రమాదకర చర్యలను నివేదించాలని ఆయన ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







