షార్జాలో పెయిడ్ పబ్లిక్ పార్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- February 25, 2025
షార్జా: రమదాన్ మాసం కోసం షార్జా పొడిగించిన పెయిడ్ పబ్లిక్ పార్కింగ్ సమయాలను ప్రకటించింది. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు పబ్లిక్ పార్కింగ్ ఫీజులు వర్తిస్తాయని షార్జా నగర మునిసిపాలిటీ తన ప్రకటనలో తెలిపింది.
నైబర్హుడ్ పార్కులు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని, అల్ సెయుహ్ ఫ్యామిలీ పార్క్, అల్ సెయుహ్ లేడీస్ పార్క్, షార్జా నేషనల్ పార్క్, అల్ రోల్లా పార్క్ సాయంత్రం 4 గంటల నుండి తెల్లవారుజాము 1 గంట వరకు పనిచేస్తాయని అథారిటీ తెలిపింది.
ఆహార సంస్థలను పర్యవేక్షించడానికి, తనిఖీ చేయడానికి సమగ్ర ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించినట్టు మునిసిపాలిటీ తెలిపింది. ఫుడ్ సేఫ్టీ ని పర్యవేక్షించడానికి 380 మంది ఇన్స్పెక్టర్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఇస్లామిక్ పవిత్ర మాసం మార్చి 1 ప్రారంభమవుతుందని, 30 రోజులు పాటు ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









