షార్జాలో పెయిడ్ పబ్లిక్ పార్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- February 25, 2025
షార్జా: రమదాన్ మాసం కోసం షార్జా పొడిగించిన పెయిడ్ పబ్లిక్ పార్కింగ్ సమయాలను ప్రకటించింది. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు పబ్లిక్ పార్కింగ్ ఫీజులు వర్తిస్తాయని షార్జా నగర మునిసిపాలిటీ తన ప్రకటనలో తెలిపింది.
నైబర్హుడ్ పార్కులు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని, అల్ సెయుహ్ ఫ్యామిలీ పార్క్, అల్ సెయుహ్ లేడీస్ పార్క్, షార్జా నేషనల్ పార్క్, అల్ రోల్లా పార్క్ సాయంత్రం 4 గంటల నుండి తెల్లవారుజాము 1 గంట వరకు పనిచేస్తాయని అథారిటీ తెలిపింది.
ఆహార సంస్థలను పర్యవేక్షించడానికి, తనిఖీ చేయడానికి సమగ్ర ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించినట్టు మునిసిపాలిటీ తెలిపింది. ఫుడ్ సేఫ్టీ ని పర్యవేక్షించడానికి 380 మంది ఇన్స్పెక్టర్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఇస్లామిక్ పవిత్ర మాసం మార్చి 1 ప్రారంభమవుతుందని, 30 రోజులు పాటు ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







