దుబాయ్ వీసా..ఇప్పుడు నివాసితులు నిమిషాల్లోనే పర్మిట్ను పునరుద్ధరించుకోవచ్చు..!!
- February 25, 2025
దుబాయ్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) కొత్త AI-ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించడంతో నివాసితులు ఇప్పుడు తమ వీసాను సులభంగా పునరుద్ధరించుకునే అవకాశం వచ్చింది. సలామా ప్లాట్ఫామ్ ద్వారానివాసితులు నిమిషాల్లోనే తమ వీసా పునరుద్ధరణను పూర్తి చేసుకోవచ్చు. వారు ప్లాట్ఫామ్ నుండి నేరుగా అప్డేట్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ప్లాట్ఫామ్ కేవలం కొన్ని క్లిక్లతో కుటుంబ సభ్యుల కోసం రెసిడెన్సీ వీసాల పునరుద్ధరణను క్రమబద్ధీకరిస్తుంది. గతంలో, పునరుద్ధరణ ప్రక్రియ డాక్యుమెంట్ పరిపూర్ణతను బట్టి ఒకటి నుండి మూడు గంటల వరకు పట్టేదని డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ గలేబ్ అబ్దుల్లా మొహమ్మద్ హసన్ అల్-మాజిద్ తెలిపారు.అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అందజేస్తే కేవలం ఒకటి నుండి రెండు నిమిషాలలో మొత్తం ప్రాసెస్ పూర్తి అవుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం నివాసితుల వీసా పునరుద్ధరణలకు మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 'సలామా' AI ప్లాట్ఫామ్ దుబాయ్లో జీవన నాణ్యతను పెంచడానికి తాజా సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడానికి తమ నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుందని GDRFA దుబాయ్ జనరల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్పాట్ డాక్టర్పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







