నకిలీ పాస్పోర్ట్ స్టాంపుల కేసు..మార్చి 2కు తీర్పు వాయిదా..!!
- February 25, 2025
మనామా: 2016లో సముద్రం ద్వారా బహ్రెయిన్ నుండి పారిపోయిన వ్యక్తి సంవత్సరాల తర్వాత విమానాశ్రయం ద్వారా నకిలీ రెన్యూవల్ స్టాంపులు కలిగి ఉన్న పాస్పోర్ట్తో తిరిగి వచ్చాడు. ఇమ్మిగ్రేషన్ అధికారి అతడిని గుర్తించడంతో అదుపులోకి తసుకున్నారు. ఇప్పుడు అతడి కేసుపై హై క్రిమినల్ కోర్ట్ లో విచారణ జరుగుతుంది. డిఫెన్స్ పిటిషన్పై విచారణను మార్చి 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
నిందితుడు ఇరాన్కు వెళ్లి అక్రమంగా ఉంటున్నాడని, దొంగ పాస్ పోర్టుతో తిరిగి వచ్చేందుకు ప్రయత్నించాడని అనేక ఆరోపణలపై ఎదుర్కొంటున్నాడు. అయితే, అతను బహ్రెయిన్కు తిరిగి వచ్చినప్పుడు, అతను ఇమ్మిగ్రేషన్ వద్ద అతడిన పాస్పోర్ట్ను సమర్పించగా అందులో స్టాంపులు అనుమానస్పదంగా ఉండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని ఒక అధికారి, సాధారణ తనిఖీలు చేస్తున్నప్పుడు, సిస్టమ్ ఇప్పటికీ వ్యక్తి దేశంలోనే ఉన్నట్లు చూపడాన్ని గమనించాడు. తదుపరి పరిశీలనలో అతడు వాంటెడ్ వ్యక్తి అని తేలింది. సముద్ర మార్గంలో పారిపోయినట్లు అంగీకరించాడు.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









