ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ..
- February 26, 2025
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధానితో భేటీ కావటం ఇది మూడోసారి. రేవంత్ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చేస్తున్న సహాయక కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలిసింది.
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీలో హైదారాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫీచర్ సిటీకి సహకారం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. అదేవిధంగా బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలిసింది. అదేవిధంగా విభజన హామీలు, పెండింగ్ నిధులు సహా రంగాల వారీగా పలు విజ్ఞాపనలను నరేంద్ర మోదీకి చేశారు.
ఇదిలాఉంటే రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అలాగే.. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి వెంట ఢిల్లీ వెళ్లిన వారిలో అధికారులు సీఎస్ శాంత కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి నాయుడు, డీజీపీ జితేందర్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







