రాయలేని కావ్యం
- March 01, 2025
సమ్మోహనాస్త్రం సంధించాలని వున్న సంధింఛలేని
జీవనాన ముక్తసరి పలకరింపులు .
ప్రతిక్షణం ఏదో తెలపాలని వున్న మదిగదిలోనే
ముంచేసే ఉపద్రవాలు.
గతమనే జ్ఞాపకాలు మాటున గుర్తొచ్చే గాయాలు
గూడుకట్టుకున్న బ్రతుకులు .
ప్రశాంత భావనతో ప్రతిక్షణం అందిపుచ్చుకోవాలనేలా
భావనజరులు .
అంతరంగాన స్వేచ్ఛగా విహరిస్తూ ఎదుర్కొనమనే
ఎదురయ్యే ఆటుపోటులు.
వెన్నంటే సమ్మిళతమై కురిపించేను అధ్భుతమైన
పరిమళాలు .
నిజాయితీ మంచితనం నడుమ నలుగుతున్న
మోసాలు చూసిన వేయలేని ప్రశ్నలు .
అబద్ధాన్ని నిజమని చెపుతూ చేయించేరు
ఆనోట ఈనోట పుకారులు .
అరాచకం రాజ్యమేలుతూ నిజాన్ని సమాధిచేసే
నరరూప రాక్షసులు .
విజ్ఞానము వ్యాపారం కాదు ప్రగతిపథంలో
నడపించక కుమ్మరించేరు కాసులు .
స్వేచ్ఛని హరిస్తూ బాధ్యతని మరచి లోనయ్యే
క్షణికసుఖాలు .
అనాగరికంతో పేదలకి న్యాయంచేయక
ప్రజాస్వామ్యంలో రాజ్యమేలే అవినీతులు .
నమ్మిన ప్రేమలో మోసం నిజంతెలిసిన నాటికి
నేలరాలుతున్న కుసుమాలు.
క్షణజీవనంలో కలతలు ఆవేశాలు నయవంచనతో
మసిబారుతున్న మమకారాలు.
అన్నింటిని మౌనంగా లోలోన మూలుగుతూ భరిస్తూ
పుడమితల్లి కార్చే కన్నీటిచుక్కలు .
కవిమనసున పురుడు పోసుకున్న అక్షరాలు
కలం విదిలించమనే అమృతాక్షరాలు .
కదపాలని చెప్పాలని అణువణువునీ సంధించాలని
*రాయలేని కావ్యం*
--యామిని కోళ్ళూరు(అబుదాబి)
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







