రాయలేని కావ్యం
- March 01, 2025
సమ్మోహనాస్త్రం సంధించాలని వున్న సంధింఛలేని
జీవనాన ముక్తసరి పలకరింపులు .
ప్రతిక్షణం ఏదో తెలపాలని వున్న మదిగదిలోనే
ముంచేసే ఉపద్రవాలు.
గతమనే జ్ఞాపకాలు మాటున గుర్తొచ్చే గాయాలు
గూడుకట్టుకున్న బ్రతుకులు .
ప్రశాంత భావనతో ప్రతిక్షణం అందిపుచ్చుకోవాలనేలా
భావనజరులు .
అంతరంగాన స్వేచ్ఛగా విహరిస్తూ ఎదుర్కొనమనే
ఎదురయ్యే ఆటుపోటులు.
వెన్నంటే సమ్మిళతమై కురిపించేను అధ్భుతమైన
పరిమళాలు .
నిజాయితీ మంచితనం నడుమ నలుగుతున్న
మోసాలు చూసిన వేయలేని ప్రశ్నలు .
అబద్ధాన్ని నిజమని చెపుతూ చేయించేరు
ఆనోట ఈనోట పుకారులు .
అరాచకం రాజ్యమేలుతూ నిజాన్ని సమాధిచేసే
నరరూప రాక్షసులు .
విజ్ఞానము వ్యాపారం కాదు ప్రగతిపథంలో
నడపించక కుమ్మరించేరు కాసులు .
స్వేచ్ఛని హరిస్తూ బాధ్యతని మరచి లోనయ్యే
క్షణికసుఖాలు .
అనాగరికంతో పేదలకి న్యాయంచేయక
ప్రజాస్వామ్యంలో రాజ్యమేలే అవినీతులు .
నమ్మిన ప్రేమలో మోసం నిజంతెలిసిన నాటికి
నేలరాలుతున్న కుసుమాలు.
క్షణజీవనంలో కలతలు ఆవేశాలు నయవంచనతో
మసిబారుతున్న మమకారాలు.
అన్నింటిని మౌనంగా లోలోన మూలుగుతూ భరిస్తూ
పుడమితల్లి కార్చే కన్నీటిచుక్కలు .
కవిమనసున పురుడు పోసుకున్న అక్షరాలు
కలం విదిలించమనే అమృతాక్షరాలు .
కదపాలని చెప్పాలని అణువణువునీ సంధించాలని
*రాయలేని కావ్యం*
--యామిని కోళ్ళూరు(అబుదాబి)
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







