ప్రత్యేకమైన అనుబంధాన్ని తెలియజేసిన "మామ్ అండ్ మీ"..!!
- March 01, 2025
మనామా: భావన్స్ బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ వార్షిక "మామ్ అండ్ మీ" ఈవెంట్ తల్లి,పిల్లల మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో BIS కమ్యూనిటీ పేరెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ సృజనాత్మకత, శైలిని ప్రదర్శిస్తూ ర్యాంప్ వాక్లో మదర్స్ పాల్గొన్నారు. ఆ తర్వాత సరదా గేమ్లను ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ పేరెంట్, చిల్డ్రన్ జంటలకు బహుమతులు అందజేశారు.
BIS ప్రిన్సిపాల్ సాజీ జాకబ్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ బలమైన కుటుంబ సంబంధాలను పెంపొందించడానికి, తల్లిదండ్రులు - పిల్లలు కలిసి అర్ధవంతమైన కార్యకలాపాలలో పాల్గొనడానికి ఒక వేదికను అందించిందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. బిఐఎస్ డైరెక్టర్లు రీతూ వర్మ, హిమాన్షు వర్మ మాట్లాడుతూ.. “తల్లులు, వారి పిల్లల మధ్య అమూల్యమైన బంధాన్ని జరుపుకోవడానికి ‘మామ్ అండ్ మి’ ఈవెంట్ మాకు ఒక అద్భుతమైన అవకాశం. మన సమాజంలో ప్రేమ, అనుబంధం, ఆనందాన్ని పెంపొందించే ఇలాంటి క్షణాలను సృష్టించడం చాలా అవసరం.’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







