రమదాన్ సందర్భంగా పౌరులకు డబుల్ రేషన్‌..!!

- March 01, 2025 , by Maagulf
రమదాన్ సందర్భంగా పౌరులకు డబుల్ రేషన్‌..!!

దోహా: అర్హత కలిగిన పౌరులకు సబ్సిడీ ఆహార రేషన్‌లను రెట్టింపు చేయనున్నట్లు ఖతార్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వెల్లడించింది. ఈ కార్యక్రమం కింద, రేషన్ కార్డుపై లభించే బియ్యం, చక్కెర, నూనె, పాలను రమదాన్ ముగిసేవరకు డబుల్ ఇవ్వనున్నట్లు తెలిపింది.   

రమదాన్ సందర్భంగా తగినంత స్టాక్ నిల్వలతో దేశవ్యాప్తంగా 300 పంపిణీ కేంద్రాల ద్వారా ఆహార రేషన్‌లను పంపిణీ చేస్తామని వెల్లడించింది. పవిత్ర రమదాన్ మాసంలోఈ చొరవ నుండి ప్రయోజనం పొందాలని మంత్రిత్వ శాఖ పౌరులకు పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com