బహ్రెయిన్ నెక్స్ట్-జెన్ ID కార్డ్..ట్రావెల్, టెక్నాలజీ గేమ్-ఛేంజర్..!!
- March 03, 2025
మనామా: బహ్రెయిన్ కొత్త జాతీయ ID కార్డ్ ఇప్పుడు అత్యాధునిక భద్రతతో రానుంది. డిజిటల్ ట్రావెల్ డాక్యుమెంట్గా పనిచేయనుంది. ఈ తాజా అప్గ్రేడ్ పౌరులు, నివాసితులు ప్రయాణించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.
“మీరు ప్రయాణించే దేశం ఎలక్ట్రానిక్ ప్రయాణ పత్రాలను అంగీకరిస్తే, కొత్త ID కార్డ్ ఆ అవసరాలను తీరుస్తుంది. ఈ ప్రాంతంలో అటువంటి ఫీచర్ను అందించే మొదటి దేశంగా మేము గర్విస్తున్నాము” అని ఇన్ఫర్మేషన్ & ఇ-గవర్నమెంట్ అథారిటీ (IGA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహ్మద్ అలీ అల్ ఖైద్ వివరించారు. పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (PKI) టెక్నాలజీ ద్వారా డిజిటల్ ట్రావెల్ అప్లికేషన్లతో అనుసంధానించబడుతుంది. ఇది సరిహద్దు గుర్తింపును నిర్ధారిస్తుంది. ID కార్డ్ హోల్డర్లు ఇబ్బంది లేని ప్రయాణాన్ని అనుభవించడానికి వీలు కల్పిస్తుంది. ఈ కార్డు అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా, సురక్షితమైన గుర్తింపునకు హామీ ఇస్తుంది. ID కార్డ్ బహ్రెయిన్ గుర్తింపు, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా ప్రతిబింబించే ఆధునిక, పరస్పరం అనుసంధానించబడిన డిజైన్ను కూడా ప్రదర్శిస్తుంది.
పౌరులు, నివాసితులు వారి ప్రస్తుత ID గడువు ముగిసిన తర్వాత కొత్త కార్డును పొందవచ్చని IGA వెల్లడించింది. అయితే, చాలామంది ఇప్పటికీ వారి పాత ID కార్డులను ఉపయోగిస్తున్నారని గుర్తించి, eKiosk యంత్రాల ద్వారా 24/7 కొత్త ఆలో సేవల ఎంపిక అందుబాటులో ఉంది. ID కార్డ్ చిప్ అప్డేట్ ను 2024లో 193,000 మంది ప్రజలు ఉపయోగించారని అల్ ఖైద్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







