వచ్చే వారం అమెరికా-ఉక్రెయిన్ సమావేశానికి సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- March 08, 2025
జెడ్డా: ఉక్రెయిన్, రష్యా మధ్య శత్రుత్వాన్ని అంతం చేయడానికి శాంతి కోసం జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలలో భాగంగా, వచ్చే వారం జెడ్డాలో అమెరికా, ఉక్రెయిన్ మధ్య జరగనున్న సమావేశాన్ని నిర్వహించాలనే పిలుపును సౌదీ అరేబియా స్వాగతించింది. ఉక్రెయిన్లో శాశ్వత శాంతిని సాధించడం లక్ష్యంగా దౌత్య కార్యక్రమాలను సులభతరం చేయడంలో రాజ్యం నిబద్ధతను సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. గత మూడు సంవత్సరాలుగా, సంఘర్షణ పరిష్కారంపై దృష్టి సారించిన అనేక సమావేశాలను నిర్వహించడంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించింది. గత నెలలో రియాద్లో అమెరికా, రష్యా మధ్య జరిగిన శాంతి సమావేశంలో సౌదీ అధికారులు పాల్గొన్నారు.
ఉక్రెయిన్ అధికారులతో సమావేశాన్ని సమన్వయం చేయడానికి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ గురువారం ధృవీకరించారు. వైట్ హౌస్లో ఆయన మాట్లాడుతూ.. శాంతి ఒప్పందం, ప్రారంభ కాల్పుల విరమణ కోసం కమిటీని ఏర్పాటు చేయడానికి విస్తృత చర్చలలో భాగంగా ఈ సమావేశం రియాద్ లేదా జెడ్డాలో జరుగుతుందని విట్కాఫ్ పేర్కొన్నారు.
మరోవైపు, "వచ్చే సోమవారం, నా సౌదీ అరేబియా పర్యటనలో క్రౌన్ ప్రిన్స్ను కలవడానికి ప్రణాళిక చేయబడింది.ఆ తర్వాత, మా బృందం మా అమెరికన్ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి సౌదీ అరేబియాలోనే ఉంటుంది." అని జెలెన్స్కీ తన X ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 28న వైట్ హౌస్లో ట్రంప్ మరియు ఉక్రేనియన్ అధ్యక్షుడి మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ దౌత్య పరిణామంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మంగళవారం కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో తన ప్రసంగంలో, జెలెన్స్కీ శాంతి చర్చల్లో పాల్గొనడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ తనకు ఒక లేఖ పంపారని ట్రంప్ వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!