వింబుల్డన్‌ క్వార్టర్స్‌కు చేరిన సానియా, హింగిస్ ల జోడి

- July 04, 2016 , by Maagulf
వింబుల్డన్‌ క్వార్టర్స్‌కు చేరిన సానియా, హింగిస్ ల జోడి

వింబుల్డన్‌ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జోడీ సాన్‌టినా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్‌ మూడో రౌండ్‌లో అమెరికన్‌- లాట్వియా జోడీ మెక్‌హేల్‌-ఒస్తాపెంకోపై 6-1, 6-0తో సానియామీర్జా-మార్టినా హింగిస్‌ జోడీ గెలుపొందింది. దీంతో ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
మరోవైపు పురుషుల డబుల్స్‌లో ప్రీక్వార్టర్స్‌లో బోపన్న జోడి తడబడింది. మూడో రౌండ్లో హెన్రీ-పీర్స్‌ జోడీ చేతిలో 6-2, 3-6, 4-6, 7-6(8-6), 6-8తో ఓటమిపాలై బోపన్న-మెర్జియా జోడీ ఇంటిదారి పట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com