IPL 2025: ఉప్పల్లో పరుగుల విధ్వంసమే: హెచ్సీఏ జగన్
- March 11, 2025
హైదరాబాద్: హైదరాబాద్లో క్రికెట్ అనగానే అందరికి గుర్తొచ్చేది హెచ్సీఏ.. ఉప్పల్ స్టేడియం.ఒకప్పుడు హెచ్సీఏ అంటే అంతర్గత కుమ్ములాటలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచేది.మరో వైపు ఉప్పల్ స్టేడియం అంటే గాలికి ఊడిపోయిన కెనోపి.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని గ్రౌండ్..పావురాల రెట్టలతో కూడిన సీట్లు దర్శనమిచ్చేవి. కానీ ఇవన్నీ మారిపోయాయి. అధునాతన హంగులతో స్టేడియాన్ని ముస్తాబు చేశారు.
గత ఐపీఎల్లో ఉప్పల్ స్టేడియానికి ఉత్తమ పిచ్ అవార్డ్ కూడా లభించింది.దీని వెనుక హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కృషి ఎంతో ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఆయన మాగల్ఫ్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అప్కమింగ్ ఐపీఎల్ సీజన్ కోసం స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లతో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఈసారి ఉప్పల్ మైదానంలో పరుగుల మోత మోగుతుందని, రికార్డ్ స్కోర్లు నమోదవుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







