బాబి దర్శకత్వంలో రవితేజ
- July 04, 2016
మా సంటే బస్సు పాసు కాదురా... ఎవడు పడితే వాడు వాడేసుకోవడానికి...' అంటూ 'పవర్'లో పవర్ఫుల్ డైలాగు చెప్పాడు రవితేజ. ఆ మాసిజం జనాలకు బాగా నచ్చింది. దాంతో 'పవర్' విజయవంతమైన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఆ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టాడు బాబి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయిక కుదిరిందన్నది ఫిల్మ్నగర్ టాక్. రవితేజ కథానాయకుడిగా డి.వి.వి. దానయ్య ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి బాబి దర్శకత్వం వహిస్తారని సమాచారం. 'బెంగాల్ టైగర్' తరవాత రవితేజ సినిమా ఏదీ ఇంత వరకూ పట్టాలెక్కలేదు. కథల విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బాబి చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









