టెర్రర్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు
- July 04, 2016
దాయిష్ తీవ్రవాద సంస్థ దేశంలో ఉగ్రదాడులకు పథక రచన చేయగా, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ కుట్రను భగ్నం చేశారని కువైట్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. దీనికి సంబంధించిన మూడు కేసుల్లో పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ తెలిపింది. కువైట్కి చెందిన తలాల్ నయెఫ్ రాజా, దాడులకు పాల్పడేందుకు సమాయత్తమవుతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన ఎస్టాబ్లిష్మెంట్పై దాడికి ఇతను కుట్రపన్నాడు. దయీష్ నుంచి తనకు అందిన ఆదేశాల మేరకు దాడులకు పాల్పడేందుకు సమాయత్తమవుతున్నట్లుగా నిందితుడు అంగీకరించాడు. ఓ తుపాకీతోపాటు, ఎక్స్ప్లోజివ్ బెల్ట్ ధరించి దాడులకు పాల్పడాలనుకున్నట్లు వివరించాడు నిందితుడు. మరో కేసులో అలి మొహమ్మద్ ఒమర్ అనే వ్యక్తితోపాటు అతని తల్లి అబ్దుల్లా మొహమ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా దాయీష్ సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. కువైట్కి చెందిన ఓ వ్యక్తి అలాగే ముబారక్ ఫహాద్ అనే గల్ఫ్ నేషన్కి చెందిన మరో వ్యక్తి, వీరితోపాటు ఆసియాకి చెందిన మరో వ్యక్తి గ్రూపుగా ఏర్పడి తీవ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నిస్తుండగా వారినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుల సందర్భంగా వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









