యాహ్యా సీఫుడ్ రెస్టారెంట్.. వేలమంది కార్మికులకు ప్రతిరోజూ ఇఫ్తార్..!!
- March 16, 2025
దుబాయ్: వాటర్ఫ్రంట్ మార్కెట్లోని ఉద్యోగులకు ఇఫ్తార్ అనేది ఒక ఖరీదైన వ్యవహారం. ఉద్యోగులు తాము అమ్మే వాటిని తినడం చాలా అరుదు. కానీ రమదాన్ సందర్భంగా, వారికి మరెక్కడా లేని విధంగా ఇక్కడ విందును అందిస్తారు. ప్రతి సాయంత్రం అస్ర్ ప్రార్థన తర్వాత, మార్కెట్ పార్కింగ్ ప్రాంతం భోజన స్థలంగా మారుతుంది. ఇక్కడ వందలాది మంది బిర్యానీతో కూడిన భోజనంతో ఉపవాసం విరమిస్తారు.
గత ఆరు సంవత్సరాలుగా వాటర్ఫ్రంట్ మార్కెట్లోని యాహ్యా సీఫుడ్ రెస్టారెంట్.. కార్మికులు, విక్రేతలు, దుకాణదారులకు ఉచిత ఇఫ్తార్ భోజనాలను అందిస్తోంది. పవిత్ర మాసంలో ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకుంటుంది. ఈ సంవత్సరం మార్కెట్లోని క్లీనర్లు, సీఫుడ్, మాంసం, కూరగాయల విక్రేతలు, సందర్శకులు, డెలివరీ రైడర్లతో పాటు ఉపవాసం ముగించడానికి వచ్చే డెలివరీ రైడర్లకు ప్రతిరోజూ 2,000 కంటే ఎక్కువ ఇఫ్తార్ భోజనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తమకు ఇంతగా ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వడం ఒక సంప్రదాయంగా మారిందని రెస్టారెంట్ యజమాని యాహ్యాఫాయు అన్నారు. మార్కెట్లో సముద్ర ఆహార విక్రేత అయిన మొహమ్మద్ సల్మాన్.. ఇంత విలాసవంతమైన అనుభవాన్ని ఇచ్చినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







