కేంద్ర ప్రభుత్వ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ..
- December 22, 2016కేంద్ర ప్రభుత్వ నూతన సంవత్సర క్యాలెండర్ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. 'నా దేశం మారుతోంది. మరింతగా పురోగమిస్తోంది' అనే థీమ్తో ఈ కొత్త క్యాలెండర్ను రూపొందించారు. ఈ క్యాలెండర్కు సంబంధించిన యాప్ను సైతం ప్రారంభించారు. క్యాలెండర్లో ఒక్కో పేజీని ఒక్కో థీమ్లో డిజైన్ చేశారు. సెప్టెంబర్ నెల పేజీని 'నగదురహిత లావాదేవీలు' థీమ్తో రూపొందించారు. డిసెంబర్ 25న 'గుడ్ గవర్నెన్స్ డే'ను పురస్కరించుకుని ఆ రోజున 100 రోజుల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడతామని వెంకయ్య ప్రకటించారు. ఆ రోజు కేంద్రమంత్రులు, ఎంపీలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో సందర్శించి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..