భవనం పై నుంచి పడి వ్యక్తి మృతి

- May 25, 2017 , by Maagulf
భవనం పై నుంచి పడి వ్యక్తి మృతి

షార్జా:34 ఏళ్ళ పాకిస్తానీ వర్కర్‌, ఓ భవనం ఐదవ అంతస్తు నుంచి కిందకి పడి చనిపోయారు. ఈ ఘటన అల్‌ బతీన్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఆ వ్యక్తి కింద పడ్డారు. ఈ ఘటన గురించి కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మేనేజ్‌మెంట్‌, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీస్‌ పెట్రోల్‌, అంబులెన్స్‌, సిఐడి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ లేబరేటరీకి తరలించారు. కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మేనేజ్‌మెంట్‌ని పోలీసులు విచారిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com