ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్లో యూఏఈ రూలర్స్
- June 25, 2017యూఏఈ:యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్ని ఆదివారం జబీల్ మాస్క్ వద్ద నిర్వహించారు. షేక్ మొహమ్మద్తో కలిసి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ప్రార్థనలు నిర్వహించారు. వెల్ విషర్స్ నుంచి షేక్ మొహమ్మద్ రంజాన్ శుభాకాంక్షల్ని అందుకున్నారు. జబెల్ మాస్క్ వద్ద పలువురు షేక్ మొహమ్మద్కి రంజాన్ శుభాకాంక్షలు తెలపడంతోపాటుగా, సమర్థ నాయకత్వంలో యూఏఈ మరింత ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ అక్కడికి వచ్చినవారందరికీ ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. షేక్ జాయెద్ మాస్క్లో మొహమ్మద్ బిన్ జాయెద్ - ఈద్ అల్ ఫితర్ ప్రేయర్ నిర్వహించారు. పలువురు ప్రముఖులు, అధికారులు, పౌరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..